ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో బాక్స్ ఆఫీస్ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇక దేవర సినిమాతో మరోసారి పాన్ ఇండియా లెవెల్లో తన సత్తా చాటుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది. ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానుందని మేకర్స్ గతంలోనే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను భారీ లెవెల్లో ఆకట్టుకున్నాయి.
ఇక ఇలాంటి క్రమంలో తారక్కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ నెటింట వైరల్గా మారింది. ప్రతి హీరోకి కెరీర్లో కొన్ని అరుదైన తీపి జ్ఞాపకాలు ఉంటాయి. అలా ఎన్టీఆర్ కెరీర్లో ఓ సినిమా కూడా ఆయనకు మర్చిపోలేని తీపి జ్ఞాపకమట. ఆ మూవీ మరేదో కాదు బాద్షా. శీను వైట్ల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్ పర్ఫామెన్స్తో పాటు.. బ్రహ్మానందం కామెడీ టైమింగ్ కూడా సినిమాకు హైలెట్గా నిలిచింది. ఇక ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఈ సినిమా గురించి వివరిస్తూ.. నాకు ఈ సినిమా కోసం ముగ్గురు హీరోలు సహాయం చేశారని.. అది కూడా వారు ఏమీ ఆశించలేదంటూ చెప్పుకొచ్చాడు. ఇక ముగ్గురు హీరోస్ మరెవరో కాదు రామ్ చరణ్, మహేష్ బాబు, సిద్ధార్థ్.
రామ్ చరణ్ సినిమా ఫస్ట్ డే రోజున ఎన్టీఆర్కు క్లాప్ ఇచ్చారు. రాంచరణ్ చేతుల మీదుగానే ఈ సినిమా ప్రారంభం అవ్వడం విశేషం. ఇక మహేష్ బాబు ఈ సినిమాకు వాయిస్ ఓవర్ అందించారు. ఒక్క రూపాయి కూడా ఆశించకుండా తారక్ తో ఉన్న బాండింగ్, శ్రీను వైట్లతో ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగానే ఆయన దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక సినిమా కోసం తన వంతు సహాయం అందించిన మరో స్టార్ హీరో సిద్ధార్థ్. సిద్ధార్థ ఈ సినిమాలో గెస్ట్ రోల్ ప్లే చేశాడు. కేవలం నాపై ఉన్న ఇష్టంతోనే సిద్ధార్థ ఆరోజు ఆ పాత్రలో చేశాడని తారక్ గతంలో వివరించారు. తర్వాత కాలంలో చరణ్, ఎన్టీఆర్ కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. మహేష్ భరత్ అనే నేను సినిమా ఫ్రీ రిలీజ్ ఇంట్లో తారక్ గెస్ట్ గా హాజరై సందడి చేశారు. ఇక ఇండస్ట్రీలో ప్రతి హీరోకు ఇలాంటి హెల్తీ కాంపిటేషన్ ఉండడం మంచిదని తారక్ వివరించాడు.