సీనియర్ స్టార్ హీరోయిన్ టబుకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో పరిచయం అవసరం లేదు. ఈమె టాలీవుడ్ ను వదిలి చాలా కాలమైనా ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు ఆమెను ఆరాధిస్తూనే ఉన్నారు. టాలీవుడ్ లో టాప్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత బాలీవుడ్కు చెక్కేసి అక్కడ అవకాశలను దక్కించుకుంటూ నటిస్తుంది. చివరిగా బాలీవుడ్ లో అరుణ్ మే కహా దుంత సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమాలో అజయ్ దేవ్ గణ్ సరసన నటించిన ఈ అమ్మడు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేసింది. ఇందులో భాగంగా టబ్బు మాట్లాడుతూ.. అజయ్ దేవగణ్కు సంబంధించిన ఎన్నో షాకింగ్ విషయాలను వెల్లడించింది.
అజయ్ కి నేను చాలా రెస్పెక్ట్ ఇస్తానని.. నాకు సినీ నిర్మాతలతో ఏ ప్రాబ్లం వచ్చినా నా తరఫున మాట్లాడడానికి మొదట అతన్నే పిలుస్తానంటూ చెప్పుకొచ్చింది. ఆయన కూడా నాతో అన్ని విషయాలను షేర్ చేసుకుంటాడని.. అంతే కాదు నాతో కలిసి పని చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు అంటూ వివరించింది. మేము ఎంత క్లోజ్ గా ఉన్నా నా నిర్ణయలలో ఎప్పుడు ఇన్వాల్వ్ కాడని.. ఒకరిని ప్రభావితం చేయడానికి ఆయన ప్రయత్నించడంటూ వెల్లడించింది.
ప్రతి ఒక్కరిని అజయ్ గౌరవిస్తాడని.. అలాగే అతను నా సోదరుడికి చిన్ననాటి స్నేహితుడు అంటూ చెప్పుకొచ్చింది. సినిమాల్లోకి రాకముందు నుంచే నాకు అజయ్ తెలుసని.. ఆయన పెళ్లి అయిన తర్వాత కూడా మా స్నేహం అలాగే కంటిన్యూ అవుతుంది. సినిమాలంటే ఆయనకు చాలా ఫ్యాషన్ అంటూ వివరించింది. అయితే మొదట అజయ్ దర్శకుడు కావాలని అనుకున్నారని.. టబ్బు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం టబ్బు చేసిన కామెంట్స్ నెటింట వైరల్గా మారడంతో.. అంతా ఆశ్చర్యపోతున్నారు.