సౌందర్య చనిపోయిన తర్వాత ఆమె సంపాదించిన కోట్ల ఆస్తి ఏమైంది.. ఎవరు తీసుకున్నారు తెలుసా..?

అలనాటి అందాలరాశి సౌందర్య భౌతికంగా మన మధ్య లేకున్నా.. ఇప్పటికీ ఆమె ఎంతో మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఆమె చనిపోయి ఇంతకాలం అవుతున్న.. ఇప్పటికీ ఇండస్ట్రీలో ఆమె ప్రస్తావన వస్తూనే ఉంటుంది. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించి తనదైన ముద్ర వేసుకున్న సౌందర్య.. ప్రేక్షకుల హృదయాలను కట్టిపడేసింది. ఎంతోమంది ఫేవరెట్ హీరోయిన్గా మారింది. సావిత్రి తర్వాత అంతటి పేరు సొంతం చేసుకున్న ఏకైకనటిగా సౌందర్య గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్ షోలకు దూరంగా ఉంటూ.. ఫ్యామిలీ ఆడియన్స్‌ను కట్టిపడేసిన ఈ అమ్మడు.. న‌ట‌నతో పాటు అందంతోను ఆడియ‌న్స్‌ను క‌ట్టిప‌డేసింది.

దాదాపు అప్పటి టాలీవుడ్ స్టార్ హీరోస్ అయిన నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, చిరంజీవి ఇలా అందరితో నటించి మెప్పించిన ఈ అమ్మడు.. వెంకటేష్ తో ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. వీరిద్దరి కాంబినేషన్ ఆల్ టైం సూపర్ హిట్గా క్రేజ్ సంపాదించుకుంది. అప్పట్లో స్టార్ హీరోలు సైతం ఆమె డేట్స్ కోసం ఎదురు చూసేవారన‌డంలో అతిశయోక్తి లేదు. అంతలా క్రేజ్‌ సంపాదించుకున్న సౌందర్యకు.. తెలుగు ప్రేక్షకులు భ్రమరధం పట్టారు. ఎస్. వి. కృష్ణారెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కిన రాజేంద్రుడు గజేంద్రుడుతో సౌందర్యకు మంచి పాపులారిటీ దక్కింది. తర్వాత తెలుగులో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఇలా తను నటించడం ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో మంచి గుర్తింపు వ‌చ్చింది.

ఇక సౌందర్య తెలుగుతోపాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాష‌లోను క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఆప‌ట్లో రాజకీయపార్టీ ప్రచారం కోసం బయలుదేరిన సౌందర్య.. హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయింది. సౌందర్య ఈ లోకాన్ని విడిచి వెళ్లిన ఆ క్ష‌ణం ఇండ‌స్ట్రీ శోక‌సంద్రంలో మునిగిపోయింది. ఇక ఇప్ప‌టికీ ఆమె ఎంతో మంది హృదాయాల‌లో దేవ‌తల ఉంది. కేవలం 31 ఏళ్లు వయసులో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సౌందర్య.. మరణించే సమయానికి కోట్ల ఆస్తిని కూడా పెట్టుకుంది. అయితే ఆ ఆస్తీ సౌందర్య భర్త, ఆమె తల్లి సమానంగా పంచుకున్నారని.. సమాచారం. చనిపోవడానికి ముందే సౌందర్య వీలునామా రాసి పెట్టిందట. కానీ ఆ వీలునామా దాచేసారని వార్తలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. కాగా ఆ వార్తల్లో నిజమంతుందో తెలియదు.