“కల్కి” ఎక్స్క్లూజివ్: ఆ విషయంలో తప్పు ఎవరిది..? నాగ్ అశ్విన్ దా..? వెర్రి జనాల దా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక జనాల ఒపీనియన్ ఓపెన్గా బయటపడుతున్న విషయం తెలిసిందే . మరీ ముఖ్యంగా ఇప్పుడు ఒక విషయం ఇంట్రెస్టింగ్ గా మారింది . ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆ సినిమాకి సంబంధించి ఎన్నో ఎన్నో గాసిప్ లు.. రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి . అయితే ఆ విషయాలపై డైరెక్టర్స్ కానీ హీరోలు కానీ కొన్నిసార్లు స్పందించరు . అప్పుడు ఎలా..? స్పందించినప్పుడు ఆ విషయం నిజమే అనుకుంటూ ఉంటారు కొంతమంది .

అయితే ఇక్కడ ఒక పెద్ద చిక్కే వచ్చి పడింది. స్పందించక పోయినంతమాత్రాన ఆ వార్త నిజమని నమ్మలేము.. స్పందిస్తేనే ఆ వార్త నిజమా..? అబద్దమా..? అని తెలుస్తుంది . ఆ విషయంలో తప్పు ఎవరిది అవ్వుతుంది..? డైరెక్టర్ దా..? లేకపోతే జనాలదా..? సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యే వైరల్ అయ్యే ప్రతి వార్తను నమ్మేయడం ఈ మధ్యకాలంలో జనాలకు అలవాటైపోయింది . తీరా సినిమా రిలీజ్ అయిన తర్వాత అయ్యయ్యో అదంతా ఫేక్ అని తెలుసుకొని బాధపడిపోతున్నారు .

ఇప్పుడు కల్కి మ్యాటర్ లో అదే జరిగింది . ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమాలో కృష్ణుడి పాత్రలో సీనియర్ ఎన్టీ రామారావు గారిని చూపించబోతున్నారు అంటూ ఓ న్యూస్ బాగా వైరల్ అయింది. చాలామంది జనాలు బాగా ఇంట్రెస్టింగ్ గా ఈ రూమర్ ని నమ్మేశారు . ఎందుకంటే మన తెలుగు జనాలకు కృష్ణుడు అనగానే గుర్తొచ్చేది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారే. అయితే సినిమాలో ఆ క్యారెక్టర్ లో వేరే వ్యక్తి కనిపించారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ డిసపాయింట్ అయ్యారు. కొంతమంది నాగ్ అశ్వీన్ పై కోపడ్డారు కూడా.. ఈ విషయంలో నాగ్ అశ్వీన్ స్పందించకపోవడం తప్పా..? లేక జనాలు వైరల్ అయ్యే వార్తను నమ్మేయడం తప్పా..?