బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వరుణ్ ధావన్.. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ యంగ్ హీరో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా క్రేజ్ను సంపాదించుకున్నాడు. బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ దక్కించుకుని దూసుకుపోతున్నాడు. 2023లో జాన్వి కపూర్ హీరోయిన్గా నటించిన బవాల్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న వరుణ్.. ఇప్పుడు మరికొన్ని సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. అయితే ప్రస్తుతం వరుణ్ ధావన్ చేసిన ఓ పని నెటింట ట్రెండింగ్గా మారింది. ప్రస్తుతం ఆయన నటించబోతున్న దాదాపు అన్ని ప్రాజెక్టులో తెలుగు హీరోయిన్లనే సెలెక్ట్ చేసుకున్నాడు ఈ యంగ్ హీరో.
రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో వస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్ లో వరుణ్ ధావన్ టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంతతో జతకట్టిన సంగతి తెలిసిందే. ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో ఈ సినిమాలు నటించగా.. ఈ సిరీస్ కు స్పిన్ ఆఫ్ గా వచ్చిన హిందీ సిటాడాల్లో సమంత హీరోయిన్ గా నటించింది. ఈ వెబ్ సిరీస్ పూర్తయి ఇప్పటికే చాలా కాలం అయింది. త్వరలోనే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ కానుంది. అలాగే మరోవైపు వరుణ్ దావన్ కొత్త డైరెక్టర్ కనీస్ తో బేబీ జాన్ అనే సినిమాలో నటించనున్నాడు ఇందులో హీరోయిన్గా కీర్తి సురేష్ను తీసుకున్నారు. 2016 అట్లీ డైరెక్షన్లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న తేరి సినిమా కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించనున్నట్లు తెలుస్తోంది.
థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఈ మూవీ ఆగస్టు రెండో తేదీన రిలీజ్ కానుంది. వీటితో పాటే వరుణ్ దావన్ ప్రస్తుతం తన తండ్రి డేవిడ్ ధావన్ డైరెక్షన్లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాలో టాలీవుడ్ సెన్సేషన్ శ్రీ లీల హీరోయిన్ సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సమంత గతంలోనే ఓ సిరీస్లో హీరోయిన్గా నటించినప్పటికీ మిగతా ఇద్దరు హీరోయిన్లు మాత్రం వరుణ్ ధావన్ ప్రాజెక్టు తోనే బాలీవుడ్కు పరిచయం కానన్నారు. అయితే బాలీవుడ్లో స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న వరుణ్ తన సినిమాలతో తెలుగు హీరోయిన్లకు సక్సెస్ ఇస్తాడో లేదో చూడాలి.