ఎస్ కల్కి టీం సంచలనం సృష్టించబోతుందా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఎంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇష్టంగా తీసుకుని నటించిన సినిమా కల్కి . ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎక్కడ ఏ కాన్సెప్ట్ లో తెరకెక్కని సరికొత్త కథతో మన ముందుకు రాబోతున్నాడు ప్రభాస్. మహానటి సినిమా డైరెక్టర్ నాగ్ అశ్వీన్ ఈ సినిమా కోసం చాలానే కష్టపడ్డాడు .
అశ్విని దత్ ఏకంగా 600 కోట్లకు పైగానే ఈ సినిమా కోసం ఖర్చు పెట్టారు . అంతేకాదు ఈ సినిమా ప్రమోషన్స్ కోసం కూడా కోట్లల్లో ఖర్చు పెడుతూ ఉండడం గమనార్హం. ఈ సినిమా జూన్ 27వ తేదీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . కాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేశారు మేకర్స్. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అమరావతి లో ప్లాన్ చేశారట .
నిజానికి మొదటగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను వైజాగ్ లో ప్లాన్ చేశారట. కానీ ఫైనల్లీ అమరావతిలో ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగాలి అంటూ అశ్వినీదత్ డిసైడ్ అయ్యారట. అంతేకాదు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదే విధంగా ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అదేవిధంగా కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ రాబోతున్నారట . అశ్విని దత్ స్పెషల్ రిక్వెస్ట్ మీదనే ఇంతమంది స్టార్స్ కల్కి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారట. దీంతో ఈ న్యూస్ సెన్సేషన్ గా మారింది..!!