ప్రశాంత్ నీల్ తో సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఆ పని చేయబోతున్నాడా..! ఫ్యాన్స్ కి బిగ్ టెన్షన్ స్టార్ట్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి ఎలాంటి హై స్పెషల్ క్రేజీ ఫాన్ ఫాలోయింగ్ ఉంది అన్న విషయం గురించి మనం డైలీ సెపరేట్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . నందమూరి నట వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ గా ఇండస్ట్రీలో బాగా క్రేజ్ సంపాదించుకున్నాడు . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు . అదేవిధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న వార్ 2 సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ పాత్రలో కనిపించబోతున్నాడు.

అంతేనా దేవర రెండు భాగాలుగా తెరకెక్కబోతుంది. హైలెట్ ఏంటంటే పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ తో భారీ అడ్వెంచర్స్ మూవీ చేయబోతున్నాడు . దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది . అయితే ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో సినిమా తర్వాత ఎన్టీఆర్ తీసుకుపోయే నిర్ణయం అందరికీ హాట్ టాపిక్ గా మారబోతుంది అంటున్నారు జనాలు .

కేవలం తారక్ హీరోగానే కాదు పలు సినిమాలలో గెస్ట్ పాత్రలు అదేవిధంగా మల్టీస్టారర్ సినిమాలను ఓకే చేయడానికి సముఖంగా ఉన్నారట. రీజన్ ఏంటో తెలియదు కానీ తారక్ సినిమా ఇండస్ట్రీలో సింగిల్ హీరోగా కాకుండా వేరొక హీరో సినిమాల్లో కూడా నటించడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. విశ్వక్సేన్ తో త్వరలోనే మల్టీస్టారర్ మూవీ రాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. దీనితో సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది..!!