చాలామందికి తెలుసు ..ఉప్పు ఎక్కువగా వాడకూడదు.. ఎంత వాడాలో అంతే వాడాలి.. లేకపోతే బిపి వచ్చేస్తుంది. అది ఉప్పు వల్ల .. మన బాడీ రోగాల బారిన పడుతుంది. ఏ వ్యాధి నుంచి అయినా సరే జాగ్రత్తగా ఉండాలి ..అంటే కచ్చితంగా ఒప్పు దూరం పెట్టాల్సిందే అంటూ జనాలు డాక్టర్స్ చెప్పుకొస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చాలా చిన్న ఏజ్ లోని హై బీపీ లో బీపీ వచ్చేస్తున్నాయి. కాగా ఇప్పుడు తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ సంచలన విషయాన్ని బయట పెట్టింది . పౌరులు ఎలాంటి ఆహారాలు తినాలి ..? ఏమి తినకూడదు అని సమాచారాన్ని అందిస్తూ మరి ముఖ్యంగా ఉప్పు ఎక్కువగా తినే వారికి హెచ్చరిక ఇస్తుంది .
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ఉప్పు తినే వ్యక్తులకు ఏం జరిగింది..? అనే విషయంపై స్పెషల్ సమాచారాన్ని వెల్లడించింది. ఉప్పు ఆరోగ్యానికి ఎలా హాని కలిగిస్తుంది అనే విషయాలను బయటపెట్టింది . మరీ ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బులకు సంబంధించిన వ్యాధులు పెరుగుతున్నది ఉప్పు వల్లే అంటూ తెలిసింది . ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఐరోపాలో ప్రతిరోజు కనీసం 10,000 మంది గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారట . అంటే ఏటా 40 లక్షల మంది గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారని మాట .
అంతేకాదు ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్లనే ఈ మరణాలు సంభవిస్తున్నాయి అని .. రీసెర్చ్ లో తెలిసింది. ఉప్పు తగ్గించుకోవడం ద్వారా ఈ సంఖ్యను తగ్గించవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు ..రోజు తీసుకునే ఉప్పులో కనీసం 25% తగ్గించాలి అప్పుడే 2030 నాటికి తొమ్మిది లక్షల మరణాలు అరికట్టవచ్చు అని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ యూరోపియన్ డైరెక్టర్ హాన్స్ గూక్కే తెలిపారు . ఒక్క రోజుకి ఒక టీ స్పూన్ ఉప్పు మనిషికి సరిపోతుందట . అయితే చాలామంది ఉప్పు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు . పలు చోట్ల కాయకూరలలోనూ ఉప్పు పైన జల్లు కొని తింటూ ఉంటారు అది మరింత ప్రమాదకరం అంటున్నారు వైద్య నిపుణులు..!!