రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో మోస్ట్ ఎవైటెడ్ మూవీ కల్కి 2898ఏడి. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తోంది. ఆమెతో పాటు దీశా పటాని కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో దాదాపు రూ.700 కోట్లకు పైగా భారీ బడ్జెట్లో రూపొందిస్తున్నారు.
ఇకపోతే ఇందులో బాలీవుడ్ భాద్షా అమితాబచ్చన్, లోక నాయకుడు కమలహాసన్ కూడా కీలకపాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాపై రోజు రోజుకి అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాపై ప్రశంసలు వర్షం కురిపిస్తూ బాలీవుడ్ అమితాబచ్చన్ పలు కామెంట్స్ చేశారు. ఈ సినిమాలో ఆయన అశ్వద్ధామ పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల ఆయన ఓ ఈవెంట్లో పాల్గొని సందడి చేశారు.
ఈ ఈవెంట్లో బిగ్ బీ మాట్లాడుతూ అశ్విన్పై ప్రశంసల వర్షం కురిపించాడు. నాగ అశ్విన్ దర్శకుడిగా ఆలోచన శక్తి చాలా అద్భుతంగా ఉంటుందని.. ఆయన ఆలోచనలకు నేను ఆశ్చర్యపోతానని.. షూటింగ్ టైంలో ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అందుకుంటుందన్న భావన నాలో కలిగిందని.. ఆయనకు నేను ఫిదా అయ్యాను అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. దీంతో ఆయన చేసినా కామెంట్స్ నెటింట వైరల్ గా మారాయి.