టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఈయన తాతకు తగ్గ మనవడిగా నటన టాలెంట్తో ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్ తెలుగు తో పాటు తమిళ్, హిందీ సినిమాల్లోనూ విజయాలు అందుకున్నా.. తర్వాత ఇతర ఇండస్ట్రీలో వైపు మొగ్గ చూపకుండా తెలుగు సినిమాలపైనే శ్రద్ధ పెట్టాడు. అయితే ఇప్పుడు మారిన పరిస్థితులకు అనుగుణంగా కుంభస్థలాన్ని బద్దలు కొట్టే బాధ్యత అందుకున్నాడు తారక్. తెలుగు తెరపై తిరుగులేని నటుడుగా యంగ్ టైగర్గా క్రేజ్ సంపాదించుకున్న తారక్.. పాత్ర ఏదైనా దానికి ప్రాణం పెట్టి జీవించేస్తాడు.
తాత నుంచి నటవరసత్వాన్ని పునికి పుచ్చుకున్న తారక్.. లక్షలాదిమంది ఫ్యాన్స్ను సంపాదించుకున్నాడు. అయితే తాజాగా పుట్టినరోజు వేడుకలు అభిమానులు గ్రాండ్ లెవెల్లో జరుపుకున్నారు. రక్తదానాలు, అన్నదానాలు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. సోషల్ మీడియాలో అయితే పోస్టులు మారి మోగిపోయాయి. చరణ్, బన్నీ లాంటి స్టార్ హీరోస్ తారక్ బర్త్డే విషెస్ తెలియజేశారు. కొరటాల శివ దర్శకత్వంలో తారక్ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్ 10న రిలీజ్ కానుంది. అసలు విషయానికి వస్తే తారక్ సోషల్ మీడియాను పెద్దగా యూజ్ చేయడన్న సంగతి తెలిసిందే.
అయినప్పటికీ అతనిని ఫాలో అయ్యే వారి సంఖ్య మిలియన్ లో ఉంది. ఇన్స్టాలో 7.4 మిలియన్ మంది ఫాలో అవుతూ ఉంటారు. కానీ ఆయన ఎవరిని ఫాలో చేయలేదు. 6.3 మిలియన్ మంది ఫాలో అవుతున్న ఫేస్బుక్లో కూడా తారక్ రెండు ఖాతాలను మాత్రమే అనుసరిస్తున్నాడు. ఆ ఖాతాల్లో ఒకటి దర్శక ధీరుడు రాజమౌళి. మరొకటి ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్. ఇక సోషల్ మీడియాలో భారీ ఫాలోవర్స్ సంపాదించుకున్న తారక్.. కేవలం రాజమౌళిని మాత్రమే ఫాలో అవుతున్నాడు. ప్రస్తుతం తారక్ సోషల్ మీడియా ఎకౌంట్ల ద్వారా ఫాలో అవుతున్న ఏకైక వ్యక్తి రాజమౌళి అని తెలియడంతో అంతా ఆనంద పడుతున్నారు. తారక్, జక్కన్న మధ్యన ఉన్న బాండింగ్ ఏంటో దీన్ని బట్టి అర్థమవుతుంది అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.