టాలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ గతేడాది జైలర్ సినిమాతో స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పటివరకు ఫ్లాప్స్తో ఇబ్బందిపడిన తలైవార్ జైలర్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. కెరీర్లోనే భారీ కలెక్షన్లను రాబట్టిన సినిమాగా ఈ మూవీ రికార్డ్లు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రజినీకాంత్ తన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ తెరకెక్కించిన లాల్ సలాం సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించాడు. అయితే ఈ సినిమా ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేదు. కాగా ప్రస్తుతం రజనీకాంత్ వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు.
ఈయన హీరోగా నటిస్తున్న తాజా మూవీ విట్టయాన్. ఈ సినిమాను జై భీమ్ డైరెక్టర్ టీజే ఙ్ఞానవేల్ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు తలైవార్. కమర్షియల్ హంగులతో సామాజిక సందేశాత్మక కథాంశంగా ఈ సినిమా రూపొందుతుంది. ఈ పాన్ ఇండియా సినిమాలో అమితాబచ్చన్, ఫహద్ ఫాసిల్, రితిక సింగ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక తాజాగా అందుతున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో రానా దగ్గుబాటి విలన్ పాతలో నటించనున్నారని తెలుస్తుంది. విద్యా వ్యవస్థలోని అవినీతి మరియు అరాచకాలే అంశంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట.
టెక్నాలజీ పై మంచిపట్టున్న స్టైలిష్ విలన్ రోల్లో రానా ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా భారీ బడ్జెట్తో తెరకెక్కనుంది. ఈ మూవీ తర్వాత రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో మరో సినిమాలో నటించనున్నాడు. తలైవార్ 171 పేరుతో ఈ సినిమా రూపొందుతుంది. త్వరలోనే సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారని టాక్. లోకేష్ ప్రస్తుతం ఈ సినిమా పూర్తి కథను సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నాడు. విశ్వ నటుడు కమలహాసన్ కు విక్రమ్ లాంటి భారీ హిట్ ఇచ్చిన లోకేష్ ఇప్పుడు రజనీకు తన కథతో ఎలాంటి హిట్ ఇస్తాడో వేచి చూడాలి.