ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ హీరోగా ప్రభాస్ దూసుకుపోతున్నాడు. వరుసగా నాలుగు సినిమాల తో రూ.300 కోట్లకు పైకి గ్రాస్ కలెక్షన్లకు కొళ్ళగొట్టిన ఏకైక హీరోగా రికార్డ్ సృష్టించిన ప్రభాస్.. సలార్ తో రూ.700 కోట్ల కలెక్షన్లను రాబట్టి తన స్టామినాను ప్రూవ్ చేసుకున్నాడు. బాలీవుడ్ లో మరోసారి రూ.100 కోట్ల కలెక్షన్ రాబట్టిన సినిమాగా సలార్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక కెరీర్ స్టార్టింగ్ లో ప్రభాస్ వరుసగా మాస్ సినిమాలో నటిస్తూ వచ్చాడు.
అందులో భాగంగానే బిగోపాల్ డైరెక్షన్లో అడవి రాముడు సినిమా నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఫ్లాప్ అయింది. తర్వాత నరసింహుడు స్టోరీ తో బి.గోపాల్ మరోసారి ప్రభాస్ వద్దకు వచ్చాడట. అయితే స్టోరీ నచ్చకపోవడంతో ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు ప్రభాస్. ఇక అప్పటికే బి గోపాల్కు ఎన్టీఆర్తో మంచి సాన్నిహిత్యం ఉంది. అప్పటికే వీరిద్దరి కాంబోలో అల్లరి రాముడు సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ బి.గోపాల్ పై ఉన్న నమ్మకంతో ఎన్టీఆర్ మరోసారి నరసింహుడు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
అయితే ఆ నమ్మకాన్ని బి.గోపాల్ నిలబెట్టుకోలేకపోయారు. ఈ సినిమాతో ఎన్టీఆర్కు ఫ్లాప్ అందించాడు. దీంతో ప్రభాస్ రిజెక్ట్ చేసిన కథని ఎన్టీఆర్ నటించి భారీ ప్లాప్ మూటకట్టుకున్నాడు అన్న వార్తలు నెట్టింట చెక్కర్లు కొట్టాయి. ఇక ఎలాగోలా ప్రభాస్ ఓ భారీ ఫ్లాప్ నుంచి తప్పించుకున్నా.. ఎన్టీఆర్ మాత్రం ఫ్లాప్ కు బలైపోయాడు. సీనియర్ హీరోలు బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్ లాంటి వారికి సక్సెస్ లో అందించిన బి.గోపాల్.. ఈ తరం హీరోలకు సరైన హిట్ ఇవ్వలేకపోయాడు.