టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ఎంతో ఇష్టంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా “బ్రో”. కోలీవుడ్ స్టార్ యాక్టర్ -డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వినోదయ సీతం సినిమాకి పూర్తిగా ఈ మూవీ రీమేక్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే తెలుగు జనాలు పవన్ కళ్యాణ్ ని ఎలా చూడాలనుకున్నారో అదే విధంగా చూపించడానికి చాలా ట్రై చేశాడు సముద్రఖని.
ఫుల్ టు ఫుల్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ నేడు ఉదయం గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నమోదు చేసుకుంది . మరీ ముఖ్యంగా ఈ సినిమాని చూడడానికి పవన్ ఫ్యాన్స్ ఎగబడిపోతున్నారు. ఎందుకంటే మనం తమ్ముడు – బద్రి – ఖుషి లాంటి పవన్ కళ్యాణ్ ను ఈ మధ్యకాలంలో చూసింది లేదు . అలాంటి పవన్ కళ్యాణ్ చూడడానికి ఈ సినిమా ది బెస్ట్ ఆప్షన్ అంటున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ . ఈ వయసులో కూడా పవన్ కళ్యాణ్ ఎంత ఎనర్జిటిక్గా డైలాగ్స్ చెబుతూ డాన్స్ వేశారు అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు .
అందరూ ఊహించినట్లే పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే తన సినిమాలో ఏదో ఒక డైలాగ్ ఎదుటి వాళ్ళకి తగిలేలా పంచ్ డైలాగులు పేలుస్తాడు అంటూ ఎక్స్పెక్ట్ చేశారు . మరీ ముఖ్యంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైలాగ్స్ అంటే ఇక చెప్పనవసరం లేదు . హై రేంజ్ లోనే ఉంటాయి . కాకపోతే ఈ సినిమాలో అలాంటి పవర్ ఫుల్ డైలాగ్స్ ఏమీ లేకపోయినప్పటికీ ఓ డైలాగ్ మాత్రం కరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ని విమర్శించే వాళ్లకు ఇచ్చి పడేసినట్లే అన్నట్టుగా ఉంది అంటూ అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు .
సినిమా స్టార్టింగ్ లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చినప్పుడు “భూమి మీదకు వచ్చిన ప్రతివాడు గెస్టె.. ఎప్పుడో ఒకప్పుడు వాళ్ల టైం అయిపోయాక వెళ్ళిపోవాల్సిందే.. అనే డైలాగ్ చెప్పుతూ.. అంతేకానీ మేము దోచేస్తాం.. అది చేస్తాం అని చిటిక వేస్తాడు “. ఈ డైలాగ్ విన్న ఎవరికైనా సరే పవన్ కళ్యాణ్ ఎవరిని ఉద్దేశించి అన్నాడో ఇట్టే అర్థం అయిపోతుంది. ఎవరికి తగలలో వాళ్ళకి తగిలేలానే పవన్ కళ్యాణ్ డైలాగ్ ను కూసింత ఘాటుగానే చెప్పాడు అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ డైలాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ బ్రో కి సంబంధించిన ఈ డైలాగ్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!