నటసింహం నందమూరి బాలకృష్ణ గత సంవత్సరం అఖండ సినిమాతో సూపర్ హిట్ ను తన ఖాతలో వేసుకుని అదిరిపోయ్ కం బ్యాక్ ఇచ్చి సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ తన 107వ సినిమా ఆయన వీర సింహారెడ్డిని క్రేజీ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
ఈ సినిమాలో బాలకృష్ణ కు జంటాగా శృతి హాసన్ నటిస్తుంరి.. మరో కీలక పాత్రల్లో కన్నడ స్టార్ హీరో దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్ఠత్మంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, పస్ట్ సాంగ్ ప్రేక్షకులను ఎంత గానో అక్టుకున్నయి.
ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా రన్ టైం లాక్ చేసినట్టు తెలుస్తుంది.. ఈ సినిమా రెండు గంటల నలబై మూడు నిముషాల రన్ టైం తో ఉండబోతుందట. అంటే 163 నిమిషాలు. ఇది భారీ రన్ టైం అనే చెప్పాలి.. బాలకృష్ణ కు కలిసి వచ్చిన ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్నా ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రలలో కనిపించ నున్నారు.