ఈ పై ఫోటోలో కనిపిస్తున్న నలుగురు అక్క చెల్లెలు గుర్తుపట్టారా.. వేరేలో శ్రీదేవికి పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి హీరోయిన్గా రాణించాలంటే అది సులువైన విషయం కాదు. అలాంటిది ఎన్నో దశాబ్ద కాలాల పాటు స్టార్ హీరోయిన్గా రాణించింది శ్రీదేవి. ఒకప్పుడు శ్రీదేవి స్క్రీన్ పై కనిపించిందంటే ఫ్యాన్స్లో సెలబ్రేషన్స్ వేరే లెవెల్ లో ఉండేవి. అప్పట్లో ఇండస్ట్రీలోని స్టార్ హీరోస్ అంత శ్రీదేవి తమ సినిమాల్లో నటించడం కోసం ఎదురుచూసేవారు అంటే ఆమె క్రేజ్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి క్రమంలోనే ఆమెను చూసి తాము కూడా సక్సెస్ దక్కించుకోవాలని తన కుటుంబం నుంచి శ్రీదేవి ముగ్గురు కజిన్స్ కూడా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టారు.
ఆ ముగ్గురు కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణించారు. ఇంతకీ శ్రీదేవితో కలిసి ఉన్న ఆ ముగ్గురు అక్క, చెల్లెళ్ళు ఎవరో గుర్తుపట్టారా.. వారే నగ్మ, జ్యోతిక, రోషిని వీళ్ళు ముగ్గురు కజిన్ సిస్టర్స్.. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ హీరోయిన్గా తిరుగులేని ఇమేజ్ను సంపాదించుకున్నారు. ఇక ఈ నలుగురు అక్క చెల్లెలుతోను కలిసిన నటించిన ఏకైక తెలుగు హీరో ఒకరు ఉన్నారు. ఆయనే మెగాస్టార్ చిరంజీవి. ముందుగా అక్క శ్రీదేవితో ఇండస్ట్రియల్ హిట్స్ జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో నటించి మెప్పించాడు. ఈ సినిమాతో వీళ్ళిద్దరూ బెస్ట్ ఆన్ స్క్రీన్ పెయిర్గా క్రేజ్ ను సంపాదించుకున్నారు. తర్వాత ఎస్పీ పరశురామ్ డైరెక్షన్లో మరోసారి కలిసి నటించారు.
ఇక శ్రీదేవి తర్వాత నగ్మాతో చిరంజీవి ఘరానా మొగుడు సినిమాలో నటించాడు. ఇక ఈ సినిమా అప్పట్లో రికార్డులు బ్రేక్ చేసింది. తెలుగులోనే కాదు సౌత్ ఇండస్ట్రీలోని మొట్టమొదటి రూ.10 కోట్ల షేర్ కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాగా రికార్డ్ సృష్టించింది. తర్వాత వీరి కాంబోలో కూడా ముగ్గురు మొనగాళ్లు, రిక్షావాడు లాంటి సినిమాలు వచ్చి సక్సెస్ అందుకున్నాయి. వీరిద్దరి తర్వాత శ్రీదేవి రెండో చెల్లి జ్యోతిక తోను చిరంజీవి ఠాగూర్ సినిమాలో కలసి నటించాడు. ఈ సినిమా కూడా అల్టిమేట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. అయితే ఈ సినిమాలో జ్యోతిక సెకండ్ హీరోయిన్గా కనిపించింది. ఇక చివరిగా శ్రీదేవి చిన్న చెల్లి రోషిని చిరంజీవి మాస్టర్ సినిమాలో నటించిన మెప్పించారు. అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో తెలుగులో మరోసారి రోషిని కనిపించలేదు.