కోట్లు ఉన్నా చిరంజీవి.. ఆరోజు మాత్రం నేల మీద పడుకుంటాడా.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఎన్నో అవమానాలు తర్వాత స్టార్ హీరో రేంజ్‌కు ఎదిగాడు. తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా సామ్రాజ్యాన్ని స్థాపించి తనదైన ముద్ర వేసుకున్నాడు. లక్షలాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకుని ఇప్పటికి టాలీవుడ్ నెంబర్ వ‌న్‌ హీరోగా రాణిస్తున్నాడు. వృత్తిపరంగా.. నటుడుగా, డాన్సర్ గానే కాదు.. రియల్ లైఫ్ లోను గొప్ప వ్యక్తిత్వం, సేవ గుణంతో ఇంత‌లా ఎదిగిన చిరు కెరీర్‌లో ఓ మంచు తునక.. ఆయన నేలపై పడుకోవడం. కోట్ల ఆస్తులుండి.. లగ్జరీ లైఫ్ ఉన్న చిరంజీవి నెల పై పడుకుంటాడా అని ఆశ్చర్యపోతున్నారా.. కానీ అది నిజం. చిరు సినిమా ఈవెంట్‌లో, సక్సెస్ సెలబ్రేషన్స్ అయిపోయినా తర్వాత ఇంటికి వెళ్లి నేలపైనే పడుకుంటాడట. దానికి కారణం సినిమా ఏవెంట్లో చిరున సినీ ప్రముఖులు ఆహా,వోహా అన్ని పొగుడుతుంటారు.

Megastar's sleepless nights for God Father - Telugu 360

ఆకాశానికి ఎత్తేసి ఆయన మించిన హీరో లేరన్నట్లు చెబుతారు. రియల్ హీరోని చేసేస్తారు. అదే స్థాయిలో అభిమానుల ప్రేమ, ఆదరణ చూపిస్తారు. ఇంతలా ఆదరిస్తూ మమ్మల్ని ప్రేమిస్తున్నారు అంటే మా కంటే గొప్ప వాళ్ళు లేరని తమ భావిస్తుంటామని.. నిజంగా హీరోల ఫీల్ అవుతామని.. కాసేపు మమ్మల్ని మేము మర్చిపోతం అంటూ చెప్పుకొచ్చాడు. అయితే అభిమానం ప్రేమని ఎప్పుడు తలకెక్కించుకొని ప్రవర్తించను.. అందుకే సినిమా ఈవెంట్లు పూర్తయిన తర్వాత ఇంటికెళ్లి నేలపై పడుకుంటానని.. నేలపైనే నిద్రపోతానని.. నన్ను ఇంతలా ఆదరిస్తున్నారంటే ఆ గొప్పతనం నాది కాదు.. ఆడియన్స్‌ది అంటూ చెప్పుకొచ్చారు. మీరు చూపించే ప్రేమ, అభిమానం ఎప్పుడూ గుండెల్లో దాచుకుంటానని.. అంతేకానీ ఎప్పుడు తలకెక్కించుకోలేదని చిరు వెల్లడించారు.

Raja Vikramarka Songs - Eraraoi Song - Chiranjeevi, Amala, Radhika

గతంలో చిరంజీవి నటించిన ఇంద్ర మూవీ ఈవెంట్ లో ఈ విషయాన్ని ఆయన షేర్ చేసుకున్నాడు. ఇటీవల ఇంద్ర రీ రిలీజ్‌ జరిగిన సందర్భంగా ఇంద్ర ఆడియో ఈవెంట్‌ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియో తెగ వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కెరీర్‌లోనే బిగఎస్ట్‌ బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఒకటైన జగదేకవీరుడు అతిలోకసుందరి రేంజ్ లో ఈ సినిమా రూపొందుతుంది. సోషల్ ఫాంటసీ ఎలిమెంట్స్‌తో ప్రస్తుత జనరేషన్‌కి.. ఫాంటసీ ఎలిమెంట్లకి ముడి పెడుతూ సినిమాను తెరకెక్కిస్తున్నాడు యంగ్ డైరెక్టర్ మల్లిడి విశిష్ట. త్రిష, మీనాక్షి చౌదరి, సురభి, ఈషా చావ్లా కీలకపాత్ర నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం తుది ద‌శ‌కు చేరుకుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. కానీ షూటింగ్, సీజ్‌ వర్క్ ఆలస్యం కారణంగా సంక్రాంతి భరినుంచి సినిమా తప్పుకొనుందట.