టాలీవుడ్ లో హీరోలుగా రాణించిన వారిలో కామెడీ జోనర్ సినిమాల్లో తమ కామెడీ టైమింగ్ తో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న వారు అతి తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో టాలీవుడ్లో రాజేంద్రప్రసాద్ తర్వాత అంతే ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న హీరో వేణు తొట్టెంపూడి. స్వయంవరం సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో మొదటి సినిమాతోనే బ్లాక్ పాస్టర్ సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, కల్యాణ రాముడు, పెళ్ళాం ఊరెళితే, చెప్పవే చిరుగాలి, కుషి కుషీగా ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు. అయితే ఉన్నట్టుండి సినిమాలకు గుడ్ బై చెప్పేసి బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టాడు వేణు తొట్టుమూడి. ఇంతటి సక్సెస్ఫుల్ కెరీర్ను సడన్గా వదిలిపెట్టేసి బిజినెస్ లోకి అడుగు పెట్టడానికి కారణమేంటని ఎంతోమంది అభిమానులు అప్పట్లో సందేహాలు మొదలయ్యాయి. కానీ.. ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరికీ సక్సెస్ వస్తుందో.. ఎవరికి ఫెయిల్యూర్ వస్తుందో.. తెలియదు.
ఈ క్రమంలోనే మెల్లమెల్లగా హీరోగా అవకాశాలు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడానికి కూడా ఓకే చెప్పానని.. కొంతమంది డైరెక్టర్ తమకు కథ ఒకలా చెప్పి క్యారెక్టర్ని మరోలా మార్చేసి సినిమాలో తెరకెక్కించారు అందుకే ఇండస్ట్రీకి దూరమైనట్లు వేణు తొట్టెంపూడి వెల్లడించారు. ఉదాహరణకి 2012లో వచ్చిన తారక్ – బోయపాటి కాంబో మూవీ దమ్ము సినిమాలో ఆయన ఓ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే బోయపాటి శ్రీను తనకు కథ చెప్పినప్పుడు హీరో తర్వాత ఆయనకు సమానమైన పాత్ర అని వెల్లడించారని.. కథకు మీ పాత్ర ఎంతో కీలకమైనదని చెప్పుకొచ్చాడని.. చివరకు ప్రాముఖ్యత లేని ఓ పాత్ర ఇచ్చి సినిమాలో చూపించారని.. అందుకే అప్పటినుంచి ఏ క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్ చేయకూడదని భావించ అంటూ వెల్లడించాడు. ఇక ఈ సినిమా కోసం వేణు అప్పట్లో హీరోగా నటించాల్సిన రెండు సినిమాలను కూడా పక్కన పెట్టాడట. దీంతో కోటి రూపాయలు వరకు నష్టం వచ్చిందట.
అయితే తర్వాత అక్కినేని నాగార్జున, సుమంత్ కాంబినేషన్లో స్నేహమంటే ఇదేరా సినిమా వచచ్చింది. ఈ సినిమాలో ముందుగా సుమంత్ క్యారెక్టర్ కి వేణుని భావించారట. రేపు షూటింగ్ అనగా సాయంత్రం నిర్మాత ఆర్.బి చౌదరి ఆఫీస్ నుంచి మీకు ఈ సినిమా అవకాశం లేదు.. నాగార్జున గారు మీకు బదులుగా తన మేనల్లుడు తీసుకున్నారని చెప్పేసాడట. దానికి వేణు చాలా బాధపడినట్లు ఇంటర్వ్యూలో వెల్లడించాడు. నాగార్జున గారి మీద అభిమానంతో ఒక సినిమాను వెనక్కినట్టు మరి ఈ సినిమాకి డేట్స్ ఇచ్చా. అప్పుడు ఇవన్నీ వృధా అయ్యాయి. డబ్బులు నష్టపోయిన పర్లేదు కానీ.. ఎంచుకున్న సినిమా నుంచి కనీస గౌరవం లేకుండా తప్పించడం సరికాదని వేణు తొట్టిమూడి ఇంటర్వ్యూలో ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఎలాంటి సంఘటనలు చాలానే ఉన్నాయని.. అందుకే సినీ ఇండస్ట్రీని వదిలి పెట్టేసానంటూ చెప్పకొచ్చాడు. అలా ఈ హీరోకు నాగ్, బోయపాటి కావణంగా కోట్ల నస్టం వచ్చింది.