పెళ్లికి ముందే చైతు – శోభితల మధ్య మొదలైన గొడవలు..

అక్కినేని హీరో నాగచైతన్య – శోభిత దూళిపాళ్లకు ఇటీవల ఎంగేజ్మెంట్ జరిగిన సంగ‌తి తెలిసిందే. ఈ విషయాన్ని నాగార్జున ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. దీంతో ఫ్యాన్స్ అంతా ఆశ్చర్యపోయారు. సమంతతో విడిపోయిన తర్వాత చైతన్య, శోభిత రిలేషన్‌లో ఉన్నారంటూ.. వారికి సంబంధించిన ఎన్నో ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి. ఆ వార్తలను నిజం చేస్తూ ఈ జంట నిశ్చితార్థం చేసుకుని ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు. అయితే శోభిత ధూళిపాళ్ల ఇటీవల తన కుటుంబ సభ్యులతో కలిసి పసుపు దంచే కార్యక్రమాన్ని ట్రెడిషనల్ గా జరుపుకుంది.

Naga Chaitanya And Sobhita Dhulipala Are Getting Engaged, Nagarjuna To  Announce Son's Wedding Soon?

ఈ ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా స్వయంగా షేర్ చేసుకుంది. కాగా.. వివాహానికి ముందే ఈ జంట మధ్యన గొడవలు ప్రారంభమయ్యాయని టాక్. వివాహం తర్వాత తన ఫ్లాట్లో కాపురం ఉండాలని నాగచైతన్య శోభిత దూళిపాళ్లకు వివరించాడట. అయితే ఆమె దానికి నో చెప్పిందని.. దీంతో వీళ్ళ‌ మధ్యన గొడవలు ప్రారంభమైనట్లు టాక్. అయితే సమంత, చైతు కలిసి ఉన్నప్పుడు వారి టేస్ట్ కు తగ్గట్టుగా ఎంతో ముచ్చటపడి ఆ ఇంటిని కొనుగోలు చేసి రీమోడల్ చేసుకున్నారు.

Naga Chaitanya and Sobhita Dhulipala's Love Story From First Sight to  Engagement - Telangana NavaNirmana Sena

విడిపోయే ముందు వరకు కూడా ఈ జంట ఆ ఇంట్లోనే కాపురం ఉన్నారు. ఈ క్రమంలోనే శోభిత మన ఇద్దరం ఈ ఇంట్లోనే ఉంటే.. నీకు సమంత జ్ఞాపకాలే గుర్తు వ‌స్తాయి. నాపై నీ ఫోకస్ ఉండదు. అందుకే ఇద్దరు సంతోషంగా ఉండలేము. ఈ ప్లాట్‌లో మనం ఉండొద‌ని శోభిత‌ చెప్పేసిందట. ఎంతో ప్రేమగా తనకు నచ్చిన రీతిలో డిజైన్ చేసుకున్న ఇంట్లో.. కాపురం పెడితే బాగుంటుందని చైతు సర్ది చెప్పడానికి ప్రయత్నించినా.. శోభిత వినకపోవడంతో.. వీరి మధ్యన గొడవలు తలెత్తినట్టు.. దీంతో నాగార్జున జోక్యం చేసుకొని ఆ గొడవకు చెక్ పెట్టారని టాక్. ఈ వార్తలో నిజమంతో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ న్యూస్ నెటింట‌ తెగ వైరల్‌గా మారుతుంది.