చిరంజీవి నటవారసుడుగా రామ్చరణ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి గ్లోబల్ స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. తండ్రికి తగ్గ తనయుడుగా నటనలో తన సత్తా చాటుకున్న చరణ్.. టాలీవుడ్ టాప్ స్టార్ల్లోనే ఒకరిగా ఎదిగిన చరణ్.. తండ్రి చిరంజీవిని ఎంత గౌరవిస్తాడో.. ఎంత విలువ ఇస్తాడో అందరికీ తెలిసిందే. అయితే ఒకానొక సందర్భంలో చిరంజీవిని.. రామ్ చరణ్ మోసం చేశాడంటూ న్యూస్ వైరల్గా మారుతుంది. రెండు నెలల తర్వాత చరణ్ చేసిన మోసం చిరుకి తెలిసి ఆశ్చర్యపోయాడట.
ఇంతకీ ఆ మ్యాటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. గతంలో షోలో రానా, సాయి పల్లవి, చిరంజీవితో కలిసి సందడి చేశారు. రాన మాట్లాడుతూ నేను స్కూల్ టైంలో చరణ్తో కలిసి చదువుకోడానికి వాళ్ళ ఇంటికి వెళ్లేవాడిని.. చిరు అంకుల్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన నక్షత్రాలు చూడడానికి ఓ టెలిస్కోప్ ఇంట్లో పెట్టుకున్నారు. నేను ఆ టెలిస్కోప్ నుంచి చూస్తున్న వెనుక నుంచి ఎవరో తలపై కొట్టినట్లు అనిపించింది.. తిరిగి చూస్తే చిరు అంకుల్ ఓరే ముందు దానికి ఉన్న లిడ్ తీసి చూడరా అన్నారు. అది నా లైఫ్ లో మోస్ట్ ఫన్నీ మూమెంట్ అంటూ రానా చెప్పుకొచ్చాడు. దీనిపై చిరు రియాక్ట్ అవుతూ నేను టెలిస్కోప్ క్యాప్ తీయమంటే రానా ఏకంగా ఇంటి కిటికీలకు ఉన్న గ్రిల్ ఏ తీసేశాడు అంటూ వెల్లడించాడు.
ఇక అప్పటివరకు రోజు చరణ్, రానా కంబైన్ స్టడీస్ చేస్తున్నారనుకున్నా. వీళ్ళేమో కిటికీ గ్రిల్ తీసేసి రాత్రంతా తిరిగి కిటికీ నుంచి మళ్లీ రూమ్ లోకి వచ్చేసేవాళ్ళు. దాదాపు వీళ్ళు రెండు నెలలుగా అలా చేస్తుంటే.. నాకు తెలుసుకోవడానికి అంత టైం పట్టింది అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు. చిరంజీవి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం మరోసారి వైరల్ గా మారుతున్నాయి. ఇక ప్రస్తుతం రానా, చరణ్ ఇద్దరు పాన్ ఇండియన్ స్టార్లుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రానా కాస్త సినిమాలను నెమ్మదిగా చేస్తున్నా.. చరణ్ మాత్రం మంచి ఫామ్ లో దూసుకుపోతున్నాడు. ఇక చరణ్ వచ్చేడాది సంక్రాంతి బరిలో గేమ్ ఛేంజర్తో ఆడియన్స్ను పలకరించడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.