తెలుగు బుల్లితెరపై యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న రష్మి యాంకర్ కాకముందే ఇండస్ట్రీలో పలు చిత్రాలలో నటించింది. కానీ ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. అయితే ఉదయ్ కిరణ్ నటించిన ఒక సినిమా లో నటించిన తర్వాత రష్మీ ఇండస్ట్రీని వదిలి వెళ్లాలనుకుందట. అలా ఎందుకు వెళ్లాలనుకుందో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.
రష్మీ ముందుగా నటిగా కెరియర్ ప్రారంభించిన తర్వాతే బుల్లితెర పైన యాంకర్ గా పేరు సంపాదించుకుంది. మొట్టమొదటిసారిగా థాంక్స్ అనే చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది రష్మి. ఈ సినిమా విడుదల అయిందనే విషయం చాలామందికి అసలు తెలియకపోవచ్చు. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ నటించిన హోలీ అనే చిత్రంలో కూడా నటించింది రష్మీ. ఇందులో ఈమె ఫ్రెండ్ క్యారెక్టర్ తో నటించింది. ముఖ్యంగా సునీల్ – రష్మీ మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు ఆ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. అసలు ఇందులో రష్మీ నటించిన విషయాన్ని కూడా చాలామందికి తెలియకపోవడం జరిగిందట.
దీంతో రష్మీకి అవకాశాలు అసలు రాలేదట. అయితే వచ్చినవి కూడా పెద్దగా తన పాత్రకు స్కోప్ ఉన్న పాత్రలు కాకుండా చిన్న చిన్న కామెడీ రోల్స్ పాత్రలు రావడంతో రష్మీ అప్పుడే ఇకమీదట ఇండస్ట్రీలో ఉండకూడదని నిర్ణయించుకుందట. అలా ఇండస్ట్రీ నుంచి వదిలి వెళ్లాలనుకున్నట్లు గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. అయితే అనుకోకుండా జబర్దస్త్ లోకి రావడం వల్ల తనకు భారీ క్రేజ్ ఏర్పడిందని.. ఈ క్రేజ్ వల్లే ఎన్నో చిత్రాలలో హీరోయిన్గా కూడా నటించాను అంటూ తెలిపింది రష్మి.