సినీ ఇండస్ట్రీలో మొదట వివాహం చేసుకోవడం.. ఏవో కారణాలతో వారికి విడాకులు ఇచ్చేయడం.. సర్వసాధారణంగా మారిపోయింది. ఇక ఎఫైర్ల విషయమైతే చెప్పనవసరం లేదు. వాటికి లెక్కే ఉండడం లేదు. కాగా తాజాగా అలా నాగచైతన్య, సమంత, నిహారిక, ధనుష్ ఇలా ఎంతో మంది స్టార్ సెలబ్రిటీస్ వారి పార్ట్నర్స్కు డివోర్స్ ఇచ్చి అభిమానులకు షాక్ ఇచ్చారు. ఒకప్పుడు విడాకులు అనేవి చాలా తక్కువగా జరుగుతుండేవి. కానీ ఇప్పుడు సెలబ్రిటీల విషయంలో విడాకులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఎంతో మంది సెలబ్రిటీలు విడిపోతున్నారు అంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అలా ఒక పెళ్లి ఫెయిల్ అయిన వెంటనే.. రెండు, మూడు ఏళ్ల గ్యాప్ తోనే మరో పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చిన సెలబ్రిటీలు కూడా ఉన్నారు. అదేవిధంగా ఓ హీరొయిన్ రెండు పెళ్లిళ్లు చేసుకుంది. అయినా అవి ఫెయిల్ కావడంతో ప్రస్తుతం సింగిల్ గానే మిగిలిపోయింది.
అయితే ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. అసలు మ్యాటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ హీరోయిన్ రేఖ. ఆమె బాలీవుడ్ లో ఒకప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. ఇక ప్రస్తుతం ఈ అమ్మడి వయసు 69 ఏళ్ళు. ఇప్పటికే రేఖకు రెండు పెళ్లిళ్లు జరిగిన.. చాలా రోజుల నుంచి ఒంటరిగానే ఉంటుంది. ఇక కెరీర్ కంటే ఎక్కువగా పర్సనల్ లైఫ్ లో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న ఈ ముద్దుగుమ్మ వైవాహిక జీవితాన్ని ఆస్వాదించాలని ఎంతో ఆశపడేదట.. అయితే ఆమె జీవిత భాగస్వామి మాత్రం ఆమె కోరుకున్న విధంగా ఎప్పుడు లేరట. రెండుసార్లు పెళ్లి చేసుకున్న అమ్మడు ముచ్చట మాత్రం తీరలేదని.. నిరాశ ఏదైనట్లు తెలుస్తుంది. అయితే చివరకు మ్యారేజ్ లైఫ్ అనుభవించే అదృష్టం నాకు లేదేమో అని ఆమె పెళ్లికి దూరం అయిపోయింది.
ఈ విషయాన్ని రేఖ స్వయంగా వివరించింది. తన మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన ఈ అమ్మడు చేసిన కామెంట్స్ ప్రకారం.. రేఖకు పెళ్లయిన ఆరు నెలలకే భర్త ముఖేష్ అగర్వాల్ సూసైడ్ చేసుకుని ఆమెను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయాడు. దానికి కూడా రేఖదే తప్పు అంటూ.. ఎంతో మంది ఆమెను బ్లేమ్ చేసేవారట. దారుణంగా కామెంట్స్ చేస్తు అవమనించారట. ముఖేష్ బతికున్నప్పుడు రేఖ నుంచి విడాకుల కోరాడని.. రేఖ మాత్రం కలిసి ఉందాం. చిన్న.. చిన్న.. సమస్యలు పరిష్కరించుకుందామని నచ్చజెప్పేదట.. ముఖేష్ మాత్రం ఆమెతో అసలు మాట్లాడేవాడు కాదట. ఆమె ముఖేష్ ను మార్చుకోవాలని ఎంతగానో ప్రయత్నించేదట. మొదటి వివాహం నిలబెట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు కూడా చేసిన ముఖేష్ మాత్రం సంతోషంగానే ఉండేవాడు కాదని వివరించింది.
ఇక దీంతో ఆమె మరో నటుడు దివంగత హీరో వినోద్ మెహ్రాని వివాహం చేసుకుంది. అయితే అప్పటికి ఆమెకు ఆ కష్టాలు మాత్రం పోలేదట. వినోద్ మెహ్రా తల్లికి రేఖ అంటే అసలు పడేది కాదని.. ఆమె వీరిద్దరి పెళ్ళికి కూడా అంగీకరించలేదని.. దాన్ని కారణంగానే వీరిద్దరూ సీక్రెట్ గా వివాహం చేసుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. అయితే వీరి బంధాన్ని ఎప్పుడు ఈ జంట బయట పెట్టలేదు. సీక్రెట్ కాని వారి బంధాన్ని కొనసాగించారు. అయితే సినీ ఇండస్ట్రీ వాళ్ళ కారణంగా దీని గురించి బయటపడింది. ఈ క్రమంలో వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించిన రేఖ మానసిక ఒత్తిడితో 2018 తర్వాత సినిమాల్లోనూ నటించడం ఆపేసింది. అయితే పెళ్లిళ్లు కాకుండా ఆమెకు అమితాబచ్చన్తో మొదట్లో ఎఫైర్ ఉండేదని టాక్.