టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేచురల్ బ్యూటీ సాయి పల్లవి నటనతో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సావిత్రి, సౌందర్య తరువాత కేవలం ట్రెడిషనల్ పాత్రలకు ప్రధాన్యం ఇస్తూ.. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ.. ప్రేక్షకులను మెప్పించింది. టాలీవుడ్ ఆడియన్స్లో మంచి పేరు సంపాదించుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం లేడీ పవర్ స్టార్ గా దూసుకుపోతుంది. ఇక తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉందనిపిస్తేనే ఎంత పెద్ద స్టార్ హీరో సినిమాల్లో ఆయన నటించే సాయి పల్లవి.. ఎవో కారణాలతో కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
అయితే ఇటీవల మళ్ళీ అవకాశాలను అందుకుంటూ.. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతుంది. ప్రస్తుతం అక్కినేని నట వారసుడు నాగచైతన్యతో కలిసి తండేల్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా.. మత్స్యకారుల జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్నారు. ప్రెజెంట్ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక సాయి పల్లవి సినిమాతో పాటే బాలీవుడ్ రామాయణంలోనూ నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. రణ్బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అమ్మడు సీత పాత్రలో ప్రేక్షకులకు కనిపించనుంది. ఇప్పటికే సినిమాపై పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఈ క్రమంలో అమ్మడి ఇష్టాయిష్టాలు ఏంటో.. ఈమె ఫేవరెట్ టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్ ఎవరో తెలుసుకోవాలని ఆసక్తి అభిమానుల్లో కచ్చితంగా ఉంటుంది. ఈ నేపద్యంలో సాయి పల్లవికి ఓ టాలీవుడ్ స్టార్ హీరో అంటే చాలా ఇష్టం అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ విషయాన్ని స్వయంగా సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో వివరించింది. అతను మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. ఆయన అంటే తనకు చాలా ఇష్టమని.. నటన, డైలాగ్ డెలివరీ, డ్యాన్స్ అన్ని తనకు నచ్చుతాయని చెప్పుకొచ్చింది. ఈ జనరేషన్ అమ్మాయై ఉండి.. మెగాస్టార్ చిరంజీవి ఫేవరెట్ హీరో అని చెప్పడంతో ప్రస్తుతం అంతా ఆశ్చర్యపోతున్నారు. పవన్ కళ్యాణ్, చరణ్, తారక్ పేర్లు చెబుతారని అంతా భావించగా చిరంజీవి పేరు చెప్పడం ఫ్యాన్స్కు ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.