సాధారణంగా ఇండస్ట్రీకి సంబంధించిన చాలామంది వ్యక్తులు ఇండస్ట్రీలో నటించే నటీమణులను, లేదా అంతకంటే ఎక్కువగా పాపులారిటీ దక్కించుకున్న సెలబ్రిటీలను వివాహం చేసుకోంటూ ఉంటారు. అయితే కొందరు సెలబ్రిటీలు మాత్రం ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఏదిగినా తమ సొంత మరదళ్ళనే వివాహం చేసుకొని లైఫ్ లో సెటిల్ అయ్యారు. అలా టాలీవుడ్ లో సొంత మరదళని వివాహం చేసుకొని పిల్లల్ని కన్నా హీరోలు ఎవరో ఆ లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం.
సీనియర్ ఎన్టీఆర్ :
నందమూరి నటసార్వభౌమ తారకరామారావు తెలుగు ఆడియన్స్ లో చెరగని ముద్ర వేసుకున్న సంగతి తెలిసిందే. కోట్లాదిమంది అభిమానాని సంపాదించుకున్న తారకరామారావు.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకముందే తన సొంత మరదలైన బసవతారకాన్ని వివాహం చేసుకున్నాడు. 1948లో వివాహం చేసుకున్న.. ఈ జంట 13 మందికి జన్మనిచ్చారు.
ఏఎన్ఆర్ :
తెలుగు ఇండస్ట్రీ ఈ రేంజ్ లో ఎదగడానికి మెయిన్ పిల్లర్స్ గా ఉన్న వారిలో ఏఎన్ఆర్ కూడా ఒకరు. ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన 1949లో తన మేన మరదలు అయినా అన్నపూర్ణను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కొడుకులు.
సూపర్ స్టార్ కృష్ణ :
సాహసోపేతమైన సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఎన్నో సినిమాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సూపర్ స్టార్ కృష్ణ.. అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఇక కృష్ణ 1961 లో తన సొంత మేన మరదలైన ఇందిరా దేవిని వివాహం చేసుకున్నారు. ఈయనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
మోహన్ బాబు :
ఒకప్పుడు ఇండస్ట్రీలు స్టార్ హీరోగా రాణించిన మోహన్ బాబు.. కలెక్షన్ కింగ్గా ఇమేజ్ని క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక మోహన్ బాబు కూడా తన సొంత మేనమరదలు అయిన విద్యదేవిని వివాహం చేసుకున్నాడు. ఈమెకు మంచు లక్ష్మి, విష్ణు జన్మించారు తర్వాత ఏవో కారణాలతో ఆమె మరణించడంతో తన రెండో మరదలు నిర్మల దేవిని మోహన్ బాబు వివాహం చేసుకున్నారు. వీరికి మనోజ్ పుట్టారు.
ఆది :
డైలాగ్ కింగ్ సాయి కిరణ్ తనయుడు అది కూడా టాలీవుడ్ లో హీరోగా పలు సినిమాల్లో నటించి మెపించిన సంగతి తెలిసిందే. ఇక 2014లో ఆది తన మేనమామ కూతురు అరుణను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు పిల్లలు కూడా ఉన్నారు.
హీరో కార్తీ :
టాలీవుడ్తో పాటు కోలీవుడ్లోను మంచి పాపులారిటి దక్కించుకుని దూసుకుపోతున్న హీరో కార్తీ.. 2011లో తన సొంత మేన మరదలు రజిని చిన్నస్వామిని వివాహం చేసుకున్నాడు.