ప్రస్తుతం చాలా మంది టాలీవుడ్ డైరెక్టర్స్ వాళ్ళ సినిమాలతో ఎవరికి వారు బిజీగా గడుపుతున్నారు. ఇక తమిళ్ ఇండస్ట్రీలో దర్శకులు కూడా మన తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికే ఆశక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తమిళ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరరాజ్ తెలుగు హీరోల మీద ఫోకస్ చేసినట్టు సమాచారం. ఇక లోకేష్.. రామ్ చరణ్తో ఓ సినిమా చేయాలని భావిస్తున్నాట.ఈ క్రమంలో చరణ్కు సోషియా ఫాంటసీ బ్యాక్ డ్రాప్లో ఓ కథను కూడా వినిపించాడట.
మరి రామ్చరణ్ దానికి ఎలా రియాక్ట్ అయ్యాడో తెలియదు కానీ.. ఇటీవల కాలంలో మన తెలుగు హీరోలతో యావత్ ఇండియన్ డైరెక్టర్లందరూ పని చేయాలని ఆరాటపడుతున్నారు. దానికి కారణం టాలీవుడ్ హీరోల క్రేజ్ ప్రపంచవ్యప్తంగా పెరిగడమే అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు వైరల్ అవుతున్న వార్తల ప్రకారం.. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్లతో ఎక్కువ మంది సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇక ఎప్పుడైతే బాహుబలి సినిమా తెరకెక్కిందో అప్పటినుంచి మన టాలీవుడ్ హిస్టరీ మొత్తం మారిపోయింది.
ఒకసారి ఒక సినిమా వచ్చి ఒక బెంచ్ మార్కును క్రియేట్ చేసిందా తర్వాత సినిమాలు కూడా అదే ప్యాటర్న్లో ముందుకు సాగుతాయి. బాలీవుడ్ జనాలు కూడా మన హీరోల సినిమాల కోసం ఎదురు చూస్తున్నారంటే ఇప్పుడు టాలీవుడ్ ఎంత ప్రత్యేకంగా మారిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తొందర్లోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించబోతుంది అనడంలో అతిశయోక్తి లేదు. రాబోయే రోజుల్లో మన తెలుగు హీరోల సినిమాలు మరింత భారీ వసూళ్లను రాబట్టే.. మరిన్ని అవకాశాలు క్రియేట్ చేయడం కాయం.