ఇండస్ట్రీకి సంబంధించిన జనాలోనూ, ప్రేక్షకులను ఆర్మాక్స్ సర్వే సంస్థ ఫలితాలు ఎప్పటికప్పుడు ఆసక్తి కలిగిస్తూనే ఉంటాయి. ఇక తాజాగా ఈ సంస్థ టాలీవుడ్ మోస్ట్ పాపులర్ హీరోల లిస్ట్ అఫీషియల్గా వెల్లడించింది. ప్రస్తుతం ఈ లిస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీ మోస్ట్ పాపులర్ హీరోగా స్టార్ హీరో ప్రభాస్ నిలవడం.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ప్రభాస్ వరుసగా ఈ జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకుంటున్నారు. కల్కి సినిమా సక్సెస్ ప్రభాస్కు మరింతగా కలిసి వచ్చిందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే టాలీవుడ్ మోస్ట్ పాపులర్ హీరోగా ప్రభాస్ మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు.
అయితే ప్రభాస్ తర్వాత స్థానాలను ఎవరు దక్కించుకున్నారని ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఈ క్రమంలో ఆర్మాక్స్ జాబితాలో వివరించిన ప్రకారం ప్రభాస్ తర్వాత స్థానం ఎన్టీఆర్ దక్కించుకోవడం విశేషం. ఇక త్వరలోనే ఎన్టీఆర్ దేవర తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మూడో స్థానం మహేష్ బాబుకు దక్కడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. త్వరలోనే మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో పాన్ వరల్డ్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు.
ఇక ఆర్మాక్స్ జాబితాలో నాలుగో స్థానాన్ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దక్కించుకున్నాడు. త్వరలోనే పుష్ప 2తో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఐదో స్థానం రామ్ చరణ్ కు దక్కింది. ఇక రామ్ చరణ్ గేమ్ చేంజర్తో మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. కాగా ఆరో స్థానంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ప్లేస్ దక్కింది. ఏడస్థానంలో నేచురల్ స్టార్ నాని ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇది నానికి నిజంగా చాలా గొప్ప విజయం. మాస్ మహారాజు రవితేజ జాబితాలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు.
అయితే మెగాస్టార్ చిరంజీవి మాత్రం లిస్టులో తొమ్మిదవ ప్లేస్ ని దక్కించుకోవడం మెగా అభిమానులకు కాస్త నీరాశ కలిగిస్తుంది. కాగా, చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర షూట్ లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంతకంతకు అంచనాలు పెరుగుతున్నాయి. చిరంజీవి తర్వాత పదో స్థానాన్ని విజయ్ దేవరకొండ సొంతం చేసుకున్నాడు.