కన్నడ ఇండస్ట్రీకి ఇటీవల కాలంలో బుల్లితెర, వెండితెరల నుంచి ఒకదాని తర్వాత ఒకటి భారీ షాక్లు తగులుతున్నాయి. వరుస మరణాలు, వివాదాలు, విడాకుల వార్తలు.. ఇలా రోజు ఏదో ఒక సంచలన సంఘటన చోటు చేసుకుంటూనే ఉంటుంది. ఇక ప్రస్తుతం కన్నడ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి మరోసారి ఓ సీరియల్ డైరెక్టర్ ఆత్మహత్య బిగ్ షాక్ మిగిల్చింది. కలర్స్ కన్నడ ఛానల్ లో ప్రసారమవుతున్న కరీమణి సీరియల్ డైరెక్టర్ వినోద్ ధోండాలే ఆత్మహత్య చేసుకున్నారు. నాగరిబావిలో తన నివాసం దగ్గర ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బెంగళూరు నగరంలోని విక్టోరియా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివరణ తర్వాత ఆత్మహత్యకు గల కారణాలు తెలియజేయనున్నారు.. వినోద్ ధోండాలే దర్శకత్వంలో సతీష్ నినాసం హీరోగా నటిస్తున్న అశోక్ బ్లేడ్ సినిమా షూటింగ్ ప్రస్తుతం పెండింగ్లో ఉంది. చివరి దశ షూటింగ్ జరుగుతున్న క్రమంలోనే డైరెక్ట్ ఆత్మహత్య చేసుకోవడం మూవీ టీంకు బిగ్ షాక్ గా నిలిచింది. శుక్రవారం నాడు హీరో నీనాసం, సతీష్ మరియు నిర్మాతలతో షూటింగ్ గురించి చర్చించినట్లు తెలుస్తుంది.
శుక్రవారం షూటింగ్ గురించి పూర్తి వివరాలను తెలియజేసిన ఆయన.. శనివార ఆత్మహత్యకు పాల్పడడం అందరికీ అనుమానాన్ని కలిగిస్తుంది. వినోద్ కు భార్య, ముగ్గురు పిల్లలు ఉండగా సినీ నిర్మాణం మరియు సీరియల్ నిర్మాణంలో కూడా ఆయన ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. నిర్మాణం ప్రారంభించిన తర్వాత వినోద్ ఆర్థిక ఇబ్బందుల్లో కురుకుపోయాడని అప్పుల బాధలతో వినోద్ ఆత్యహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వినోద్ దండల్ గత 20 సంవత్సరాలుగా కన్నడ టెలివిజన్లో యాక్టివ్ గా ఉంటూ పలు సీరియల్స్ కు దర్శకత్వం వహించాడు. కొన్ని సీరియల్స్ కు కూడా నిర్మాతగా వ్యవహరించాడు.