ద్యావుడా.. ఈ మెగా హీరో అలాంటి నిర్ణయం తీసుకున్నాడా.. ఫ్యాన్స్ కి ఇక దబిడిదిబిడే..!

పాపం .. ఈ మధ్యకాలంలో మెగా హీరో సినిమాలు హిట్ అవ్వడమే లేదు. ఏ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఆ కాన్సెప్ట్ జనాలకి పెద్దగా ఆకర్షణీయంగా అనిపించడం లేదు. దీంతో ఆ సినిమాలు ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి . మరీ ముఖ్యంగా మెగా ప్రిన్స్ గా పాపులారిటీ సంపాదించుకున్న వరుణ్ తేజ్ హిట్ కొట్టడంలో వెనకబడిపోయాడు . ఈ మధ్యకాలంలో ఆయన నటించిన సినిమా ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ కాకపోవడం గమనార్హం . ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ తన యాంగిల్ ని మారవబోతున్నాడట .

కొత్త డిఫరెంట్ కాన్సెప్ట్లు కాకుండా లవ్ స్టోరీ ఫ్యామిలీ సెంటిమెంట్ స్టోరీలను ఓకే చేస్తున్నాడట . ఈ విషయంలో వరుణ్ తేజ్ చాలా చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాడట. ఇప్పటికే విక్రమ్ సిరికొండ అనే దర్శకుడికి వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది . ప్రస్తుతం టెక్నాలజీలో అఫీషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఎక్కువగా కనిపిస్తుందో వినిపిస్తుందో చూస్తున్నాము. ఈ దర్శకుడు ఏఐ నేపథ్యంలో అమెరికాలో జరిగే ఒక ప్రేమ కథను సిద్ధం చేసుకున్నారట .

ఆ అంశాలతో పాటు ఫీల్ గుడ్ అంశాలు ఉండేలా చూస్ చేసుకున్నారట ..వరుణ్ ఇంప్రెస్ కావడంతో ఈ సినిమాని ఓకే చేశారట . అంతేకాదు వరుణ్ తేజ్ మేర్లపాక గాంధీ అని డైరెక్టర్ కి కూడా ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది .యూవీ క్రియేషన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది . విక్రమ్ సిరికొండ చిత్రం అయిపోగానే మేర్లపాక గాంధీ దర్శకత్వంలో చిత్రం సెట్స్ పైకి రాబోతుందట . సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త వెరీ వెరీ వైరల్ గా మారింది..!!