ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఐపీఎల్ సందడి ఓ లెఎల్లో నడుస్తోంది. మ్యాచ్ లు కూడా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఈ మ్యాచ్లను ఆస్వాదిస్తున్నారు. ఇక అన్నిటిని మించి ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ టీం తమ ఆటతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నారు. భారీ స్కోర్ సాధిస్తూ ప్రత్యర్థులను వణికిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును కలిసి ఫోటోకు స్టిల్ ఇచ్చారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్ అవడంతో మహేష్ ను ఎస్ఆర్హెచ్ టీం కలవడానికి గల కారణం ఏంటి అనే అంశంపై నెట్టింట చర్చలు మొదలయ్యాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ టీం అంతా కలిసి మహేష్తో యాడ్ షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎస్ఆర్ఎస్ టీం కెప్టెన్ కమిన్స్, యాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీష్ కుమార్ రెడ్డి నలుగురు మహేష్ తో కలిసి సందడి చేశారు. మొదట వీరు నలుగురు కలిసి మహేష్ తో ఫోటోలు దిగారు.
తర్వాత ఒక్కొక్కరిగా మహేష్తో విడివిడిగా ఫోటోలు దిగారు. ప్రస్తుతం ఈ టీం మహేష్ తో కలిసి దిగిన ఫొటోస్ నెటింట తెగ వైరల్గా మారాయి. ఇందులో లాంగ్ హెయిర్ స్టైలిష్ లుక్ తో మహేష్ మెస్మరైజ్ చేస్తున్నాడు. ఇటు క్రికెట్ అభిమానులతో పాటు.. మహేష్ అభిమానులు కూడా ఈ ఫొటోస్ ను షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం మహేష్ రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అలాగే ఎస్ఆర్హెచ్ తర్వాతి మ్యాచ్లో ఆర్సిబి టీం తో తెలపడనున్నారు.