చిరంజీవి లేసి లేవగానే చూసే ఫోటో ఎవరిదో తెలుసా..? సురేఖాది మాత్రం కాదండోయ్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో యమ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాడు ఎక్కడ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఆయనకు లేదు . చెప్పాల్సిన పరిస్థితి వచ్చిన ససిమేరా చెప్పడు. అలాంటి ఓ నిజాయితీగల మనిషి . మెగాస్టార్ చిరంజీవి . అందుకే కాబోలు ఆయన మెగాస్టార్ గా మారాడు. సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ గా మారింది .

జనరల్గా నిద్రలేవగానే అందరూ అరచేతులు చూసుకుంటారు.. దేవుడు అరచేతుల్లో ఉంటాడు అని నిద్రలేవగానే దేవుడు ముఖం చూస్తే అంతా శుభం కలుగుతుందని చాలామంది ఇదే పని చేస్తూ ఉంటారు . కొంతమంది భార్య ముఖం చూస్తారు.. మరి కొంతమంది భర్త ముఖం చూస్తారు.. మరి కొంత మంది తాళిబొట్టులను దండం పెట్టుకుంటారు . అయితే మెగాస్టార్ చిరంజీవి నిద్రలేవగానే ఎవరి ముఖం చూస్తాడు అనే విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . ఈ విషయాన్ని సావిత్రి గారి కూతురు చాముండేశ్వరి ఓపెన్ గా స్టేజిపై బయటపెట్టింది .

హైదరాబాదులో మహానటి సావిత్రి క్లాసిక్స్ బుక్ లాంచ్ ఈవెంట్లో ఈ విషయాన్ని బయటపెట్టింది విజయ చాముండేశ్వరి . “ఒకరోజు నేను చిరంజీవి గారి ఇంటికి వెళ్లాను ఆ టైంలో ఆయన కాలికి గాయం అయింది.. నేను వెళ్ళాను అని తెలుసుకొని కర్ర పట్టుకొని కిందకు వచ్చారు. అప్పుడు నన్ను ఎంతో ఆప్యాయంగా పలకరించి మర్యాదలు కూడా చేశారు ..ఆ తర్వాత నేను రోజు నిద్ర లేవగానే చూసేది మీ అమ్మ ఫోటోని అంటూ చెప్పారు . నా కళ్ళల్లో నీళ్లు వచ్చేసాయి . ఆయన చెప్పింది నిజమా కాదా అని డౌట్ వచ్చింది అనుకున్నారో ఏమో ఆయనే స్వయంగా పైకి వెళ్లి ఆయన రూమ్లో మా అమ్మగారి ఫోటోను తీసుకొచ్చి మరీ నాకు చూపించారు ..అప్పుడే అనుకున్నాను మా అమ్మకి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారా..? అని అంటూ చాలా ఎమోషనల్ గా మాట్లాడింది విజయ చాముండేశ్వరి”..!!