మనిషి చనిపోయే ముందు నిజంగానే కలలో అవి కనిపిస్తాయా..? అద్దం హింట్ ఇస్తుందా..?

జనరల్ గా మన ఇంట్లోని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు . మనిషికి టైం తీరిపోయాక యమదూతలు మనిషిని తీసుకెళ్లే ముందు దేవుడు ముందుగానే ఈ ప్రపంచంతో మన కాలం చెల్లిపోయింది అని చెప్పేందుకు కొన్ని హింట్స్ ఇస్తూ ఉంటారట . అలాంటివి జరిగినప్పుడు కచ్చితంగా ఆ మనిషి ఇక ఈ లోకాన్ని విడిచి వెళ్లి పోవాల్సిందే అని సంకేతం అంటూ మన అమ్మమ్మలు తాతలు చెబుతూ ఉంటారు .అవి ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!

*మనం చనిపోయే పది రోజుల ముందే శివుడు పార్వతులు కుటుంబ సమేతంగా మన కలలో వచ్చి ఆశీర్వదిస్తారట. ఈ ప్రపంచంతో ఇక నీ కాలం చెల్లిపోయింది అంటూ హింట్ ఇస్తారట.

*మనం చనిపోయే పది రోజుల ముందు నుంచి మన ముఖం అద్దంలో కనిపించదట . మనం ఎన్నిసార్లు అద్దంలో చూసుకున్న సరే అంతా తికమకగా బ్లర్ గా మన ముఖం కనిపిస్తూ ఉంటుందట.

*మనం చనిపోయే కొన్ని రోజుల ముందు మనకి కుటుంబ సభ్యులతో ఉన్న బంధాన్ని తెగిపోయేలా దేవుడు గొడవలు సృష్టిస్తారట. వాళ్ళ నోటి నుంచి ఏదో ఒక వినకూడని మాట విని మనసు హర్ట్ అయ్యేవిధంగా చేస్తూ ఉంటారట. మనిషికి విరక్తి వచ్చి ఈ ప్రపంచంతో నాకు ఇక సంబంధం లేదు అని కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తారట.

*మనిషి చనిపోయే కొద్ది గంటల ముందు బాత్రూం కి వెళ్ళిపోతారట ..చాలామంది బాత్రూంలో కూడా మరణిస్తూ ఉంటారట.

*మనిషి చనిపోయే పది రోజులు ముందు ఆయనకు ఇష్టమైన ఆహారం పూర్తిగా తినే విధంగా కోరికలు కలుగుతాయట. వాళ్లకు ఏది తినాలి అనిపిస్తే అది తినేయాలి అనిపించేస్తుంటుందట.

*మనిషి చనిపోయే కొద్ది గంటల ముందు యమదూతలు వాళ్లకు నిజంగానే కనిపిస్తారట . కొంతమందికి కొన్ని రోజుల ముందు నుంచే హింట్ ఇస్తూ ఉంటారట ..యమదూతలు వారి దగ్గరికి వచ్చినట్లు కనిపిస్తూ ఉంటారట . ఆ టైంలోనే కొంతమంది భయపడుతూ అరుపులు కేకలతో అరుస్తూ ఉంటారట..!