ఇప్పుడు ఎక్కడ చూసినా సరే టిల్లు స్క్వేర్ పేరు మారుమ్రోగిపోతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న సిద్దు జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా తెరకెక్కిన సినిమానే ఈ టిల్లు స్క్వేర్ . గతంలో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ కొట్టిన డీజేటిల్లుకి ఈ సినిమా సీక్వెల్ గా వచ్చింది. మాలిక్ రామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మార్చి 29న థియేటర్స్ లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది .
అంతేకాదు కలెక్షన్స్ పరంగా కుమ్మి పడేస్తుంది . మొదటి రోజు 68 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా రెండవ రోజు మూడవరోజు మరింత స్థాయిలో దున్నేసింది. మొత్తం ఐదు రోజులు పూర్తి అయ్యేసరికి కలెక్షన్స్ 85 కోట్లు క్రాస్ చేసి సంచలన రికార్డును నమోదు చేసింది. ఈ సినిమా హిట్ అవడంతో జూనియర్ ఎన్టీఆర్ మూవీ టీం కి సక్సెస్ పార్టీ ఇచ్చినట్లు తెలుస్తుంది .
View this post on Instagram
ఈ పార్టీలో నిర్మాత నాగవంశీ హీరో సిద్దు జొన్నలగడ్డ అలాగే ఆయన జాన్ జిగిడి దోస్త్ విశ్వక్సేన్ కలిసి పార్టీ చేసుకున్నారు . ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి . అయితే ఈ పార్టీలో ఎక్కడా కూడా డైరెక్టర్ కనిపించకపోవడం అభిమానులకి ఆశ్చర్యకరంగా అనిపించింది . ఈ సినిమా షూటింగ్ టైంలోనే సిద్దు కి డైరెక్టర్కు కూసింత క్లాషేస్ మొదలయ్యాయి అని గొడవలు కారణంగానే ఆయన ఈ పార్టీలో కనిపించలేదు అంటూ ప్రచారం జరుగుతుంది..!
View this post on Instagram