రష్మీ .. టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ యాంకర్ గా రాజ్యమేలేస్తున్న బ్యూటీ . సోషల్ మీడియాలో ఈమెపై ఎంత పాజిటివిటీ ఉంటుందో అంతే నెగిటివిటీ కూడా ఉంటుంది . మరీ ముఖ్యంగా రష్మీ మూగజీవుల పట్ల చాలా చాలా ప్రేమగా ఆప్యాయంగా ఉంటుంది . మూగజీవులను ఎవరైనా హింసించారంటే.. తాట తీసేస్తుంది . అది ఎంతటి పెద్ద వ్యక్తి అయినా సరే అలాంటి సందర్భాలు మనం ఎన్నో చూసాం . తాజాగా సోషల్ మీడియాలో రష్మీ ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసింది .
ఈ వీడియో ఎవరైనా మూగజీవులు చూస్తే కన్నీళ్లు పెట్టుకోకు తప్పదు. అంత దారుణంగా ఉంది . యాంకర్ రష్మి గౌతమ్ ఈ వీడియోని షేర్ చేస్తూ సంచలన కామెంట్స్ చేసింది . “ఆవు మనకు తల్లి కంటే ఎక్కువ .. జీవితంలో మన తల్లి మూడేళ్లు మాత్రమే తన రొమ్ములతో పాలు ఇస్తుంది .. కానీ ఆవు జీవితాంతం మనకు పాలు అందిస్తుంది .. ఈ విషయం చాలామందికి తెలియకపోవడం బాధాకరం”..
“స్వరం లేని జీవిని ఇంతలా హింసించడం ఎంతవరకు కరెక్ట్..? ఇలాంటి వ్యక్తులు తమ సొంత కుటుంబ సభ్యులపై హింస చూపడానికి కూడా వెనకడుగు వేయరు.. ఆ వ్యక్తి తల్లిని గౌరవించడం అనేది జరగదు..అని ఈ వీడియో చూస్తేనే అర్థమయిపోతుంది” అంటూ రష్మీ మూగజీవుల పట్ల ఒక వ్యక్తి దారుణంగా ప్రవర్తిస్తున్న వీడియోను షేర్ చేసింది. రష్మి బాధను అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తున్నారు జనాలు. ఇలాంటి మనుషులు ఇంతే రష్మీ ..మనము ఏం చేయలేం అంటూ మండిపడుతున్నారు . ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . కొంతమంది కడుపుకి అన్నమే తింటున్నావా వెధవ..? అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు..!
People like these won’t hesitate to show violence on own family members
Cow is more than mother to us
Mother breast feeds is first three years of life
But a cow feeds us her milk for the rest of our life
What’s makes you people think he respects his own mother when he can… https://t.co/uJzsLUj5up— rashmi gautam (@rashmigautam27) April 16, 2024