పల్లవి ప్రశాంత్ ను ప్రశ్నించినట్టు పొలిటిషన్ లను ఎందుకు ప్రశ్నించరు.. శివాజీ షాకింగ్ కామెంట్స్.. !!

తెలుగు బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ గురించి అందరికీ తెలుసు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఈయన పేరు మారుమోగిపోతున్న సంగతి తెలిసిందే. పల్లవి ప్రశాంత్ కు సంబంధించిన వార్తలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే కొంతమంది సోషల్ మీడియాలో ప్రశాంత్ ను ట్రోలింగ్స్ చేస్తూనే ఉన్నారు. దీంతో తాజాగా ఈ వార్తలపై స్పందించాడు నటుడు శివాజీ. శివాజీ మాట్లాడుతూ రైతుల గోషను, కష్టాలను ఎవరు పట్టించుకోరు. వారికి అండగా నిలబడాలని ఉద్దేశంతో పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ కు వచ్చి తన క‌ల‌ను నెరవేర్చుకున్నాడు.

ఎమ్మెల్యేను, ఎంపీని ప్రశ్నించగలరా? రైతుబిడ్డను నిలదీస్తారా? హీరో శివాజీ  ఫైర్ | Actor Sivaji supports Bigg Boss Telugu 7 Winner Pallavi Prashanth  over Social media trolls on his Promises ...

అక్కడ ఎన్నో గాయాలను లెక్కచేయకుండా కంటెస్టెంట్‌ల నుంచి మానసిక దాడిని తప్పించుకుంటూ.. ధైర్యంగా నిలబడ్డాడు. అలాంటి ప్రశాంత్ ను అది చేయలేదు.. ఇది చేయలేదు అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రశ్నిస్తున్నారు. అసలు ప్రశాంత్ గురించి మీకు ఏం తెలుసు.?. అతడు చేసే పనుల గురించి తెలియకుండా.. ఎలా మీరు అతనిపై నిందలు వేస్తారు.. అంటూ శివాజీ ఫైర్ అయ్యాడు. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన ప్రశాంత్ ను పట్టుకొని అంత గట్టిగా ప్రశ్నిస్తున్నారు.. అంటూ మాట్లాడాడు.

Hero Shivaji emerges as the top contender to win Bigg Boss Telugu 7 -  TrackTollywood

అదే ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకుండా తప్పించుకు తిరిగే పొలిటీష‌న్స్‌ను ఒక్కరైనా ప్రశ్నించారా..? ప్రశ్నించగలరా..? ఎన్నికల టైం లో ఎన్నో చేస్తామని ఆశ చూపి తప్పించుకుంటున్న.. వారిని నిలదీయగలరా..? అంటూ ఫైర్ అయ్యాడు. ఒక సాధారణ రైతుబిడ్డగా వచ్చి సక్సెస్ సాధిస్తున్న పల్లవి ప్రశాంత్‌ను ఇంతలా నిలదీయడం కరెక్ట్ కాదని.. శివాజీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో శివాజీ చేసిన వ్యాఖ్యలు నెటింట వైరల్‌గా మారాయి. ఈ విషయంలో చాలామందికి శివాజీకి సపోర్ట్‌గా నిలుస్తూ కామెంట్స్ చేస్తున్నారు.