లిక్కర్ తో ప్రత్యేక పూజలు చేయించిన వేణు స్వామి.. ఆయన ఆదేశంతో పట్ట పగలే మద్యం సేవించిన హీరోయిన్..!

తరచూ ఎవరో ఒకరిపై కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అయ్యే వేను స్వామి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన చెప్పినవి ప్రతివి జరుగుతాయని నమ్ముతున్న సినీ సెలబ్రిటీలు ఈయనతో ప్రత్యేక పూజలు సైతం చేపించుకుంటున్నారు. అలా కొందరి కెరీర్లు కూడా మారాయి.

వారిలో రష్మిక మందన కూడా ఒకరు. ఇక ఇటీవలే పాన్ ఇండియా హీరో ప్రభాస్ పై వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రభాస్ పెళ్లి మరియు హెల్త్ గురించి వేణు స్వామి కామెంట్స్ చేయడంతో శ్యామలాదేవి మరియు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈయనపై మండిపడ్డారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా డీంపుల్ హైతి మరోసారి వేణు స్వామి తో ప్రత్యేక పూజలు చేయించుకుంది.

ఆ పూజలో వేణు స్వామి డిఫరెంట్గా వైన్ బాటిల్స్ తో పూజ జరిపించి సోషల్ మీడియాలోనూ జనాలను ఆశ్చర్యపరిచాడు. ఇదో రకం పూజ అని ఇందులో తీర్థం ఉంటుందని లిక్కర్ ఉంటుందని ఎవ్వరూ ఏ మందు తాగితే దాన్నే పూజలు పెడతానని అది తాగకపోతే కూల్ డ్రింక్ పెడతానని చెప్పుకొచ్చాడు వేణు స్వామి. ప్రస్తుతం వీరి పూజలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ పూజలో డింపుల్ హైతి కి ఇష్టమైన వైన్ను పెట్టి ఆమెతో తాగించాడు వేణు స్వామి. ఇక ఈ ఫోటోలను చూసి కొందరు ఘోరంగా మండిపడుతున్నారు.