టాలీవుడ్ బ్యూటీ పావని రెడ్డి చూడగానే క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే.. ఈ చిన్నది మొదట్లో పలు తెలుగు సీరియల్స్లో నటించి మెప్పించింది. తర్వాత తెలుగు వెండితెరపై మెరిసిన ఈ ముద్దుగుమ్మ.. ది ఎండ్, డ్రీమ్, లజ్జా, డబుల్ ట్రబుల్ లాంటి సినిమాల్లో నటించింది. కానీ ఈ సినిమాలతో ఆమెకు ఊహించిన రేంజ్ లో గుర్తింపు రాలేదు. తర్వాత టాలీవుడ్ ను వదిలేసి తమిళ్ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయిన ఈ ముద్దుగుమ్మ అక్కడ కూడా పలు సీరియల్స్తో బిజీ అయింది. 2013లో తెలుగు నటుడు ప్రదీప్ కుమార్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. ఇద్దరు బాగానే ఉంటున్నారు అనుకునే సమయానికి 2017లో అతడు ఆత్మహత్య చేసుకోవడంతో భర్తను కోల్పోయింది.
అయితే భర్త పోయిన వెంటనే మరొకరితో చనువుగా ఉన్నావు ఫోటోను ప్రొఫైల్ పిక్ గా పెట్టుకుంది ఈ బ్యూటీ. దీంతో వీరిద్దరే కలిసి అతని హత్య చేశారంటూ అప్పటిలో వార్తలు వినిపించాయి. తర్వాత ఈమె పూర్తిగా చెన్నైలోనే పాగా వేసింది. అక్కడ ఆనంద్ జాయ్ అనే నిర్మాతను వివాహం చేసుకున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ కొన్నేళ్లకే అవన్నీ పుకార్లనే క్లారిటీ వచ్చేసింది. తర్వాత తమిళ్ బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొంది.. ఈ రియాల్టీ షోలో కంటెస్టెంట్ అమీర్ ప్రపోజ్ చేశారు.
అప్పటినుంచి విరిమధ్య లవ్ జర్నీ మొదలైంది. అయితే ఈ జంట ఇప్పటికీ పెళ్లికి రెడ్డి అయ్యారు. బిబి జోడి రెండో సీజన్లో జంటగా పార్టిసిపేట్ చేయడమే కాదు ట్రోఫీని అందుకున్నారు. రెండేళ్ళగా సహజీవనం చేస్తున్న ఈ జంట.. తాజాగా పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమయ్యారు. ఇటీవల ఓ తమిళ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో త్వరలోనే వీళ్ళు వివాహం చేసుకోబోతున్నట్లు వివరించారు. పావని పుట్టినరోజు నవంబర్ 9న వీళ్లిద్దరూ వివాహం చేసుకోబోతున్నట్టు వివరించారు. ఇకపోతే ఇటీవల పావని తెలుగులో చార్లి 111 సినిమాలో నటించింది. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం ఫ్యామిలీ మ్యాటర్ అనే తెలుగు వెబ్ సిరీస్ లో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.