మెగాస్టార్ చిరంజీవి.. బింబిసారా ఫేమ్ మల్లిడి వశిష్ట కాంబోలో తెరకెక్కుతున్న మూవీ ‘ విశ్వంభర ‘. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి కెరీర్లోనే మొట్టమొదటి భారీ బడ్జెట్ సినిమా ఇదే కావడం విశేషం. ఇక ఈ సినిమా ముల్లోకాల బ్యాక్ డ్రాప్ తో సోషియా ఫాంటసీ డ్రామాగా తెరకెక్కనుంది. ఇక మెగాస్టార్ రీ ఎంట్రీ తర్వాత ఆయన నటించిన సినిమాలేవి ఊహించిన రేంజ్లో ఫలితాలు ఇవ్వడం లేదు. ఇప్పటి వరకు ఆయన నటించిన సినిమాల్లో ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య తప్ప మిగతా సినిమాలేవి ఆయన రేంజ్కు తగ్గ హిట్లు అందుకోలేకపోయాయి. ఇక చివరిగా వచ్చిన భోళా శంకర్.. బోల్తా పడడంతో చిరంజీవి తన నెక్స్ట్ సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.
అలా వశిష్టతో ‘ విశ్వంభర ‘ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చిరంజీవి. ఎలాగైనా ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాలన్న కసితో ఆన్నాడు. తన 156వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలె నెలకొన్నాయి. ఈ సినిమాలో త్రిష, చిరు శాసన హీరోయిన్గా నటిస్తుంది. అలాగే కొంతమంది యంగ్ హీరోయిన్స్ కూడా చిరంజీవి విశ్వంభర లో నటిస్తున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా సురభి క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ సినిమాలో మెయిన్ విలన్ ఎవరు ఉంటారు అనే అంశంపై ఇప్పటివరకు ఎటువంటి వార్తలు రాలేదు. కాగా తాజాగా ఈ సినిమాలో మెయిన్ విలన్ పాత్రలో టాలీవుడ్ ప్రముఖ నటుడు ఉండబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
అసలు అతన్ని చిరంజీవి సినిమాలో విలన్ గా తీసుకుంటారని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అలాంటి ట్విస్ట్ ఈ సినిమాకు వశిష్ట ఇచ్చాడు. ఇంతకీ ఆ టాలీవుడ్ స్టార్ యాక్టర్ ఎవరో అనుకుంటున్నారా రావు రమేష్. ఎప్పటినుంచో వీరిద్దరి కాంబోలో ఓ సినిమా వస్తే చూడాలని చాలామంది అభిమానులు వేచి చూశారు. ఎట్టకేలకు విశ్వంభరతో అది సాధ్యమవుతుంది. అయితే చిరంజీవి లాంటి టాలీవుడ్ టాప్ హీరో ఎదురెళ్ళే స్ట్రాంగ్ విలన్ గా రావు రమేష్ సెట్ అవుతాడో లేదో అనే సందేహం ప్రేక్షకుల్లో మొదలైంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ ఎం.ఎం. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు. జనవరి 10, 2025న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.