పెళ్లైన నెల రోజులకే విడాకులకు సిద్ధమైన టాలీవుడ్ హీరోయిన్.. నిజస్వరూపాన్ని బట్టబయలు చేసిన భర్త..

ప్రముఖ బుల్లితెర నటి అడ్డల ఐశ్వర్య తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది. ఇక ఐశ్వర్య ప్రస్తుతం పలు టీవీ సీరియల్స్ లో హీరోయిన్గా నటిస్తోంది. కొంత‌కాలం క్రితం ఈమె వివాహం చేసుకొని బైబాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. కాగా ప్రస్తుతం ఈమె పలు వివాదాస్పద ఆరోపణలను ఎదుర్కొంటుంది. ఈ ఆరోపణలు చేస్తుంది మరెవరు కాదు స్వయంగా ఆమె భర్త శ్యామ్ కుమార్. ప్ర‌స్తుతం ఐశ్వర్య ప‌లు టీవీ సీరియల్స్‌లో నటిస్తూ మరోపక్క.. నీ రూటే సపరేటు, ఈ సినిమా సూపర్ హిట్ గ్యారెంటీ, త్రిముఖి లాంటి చిన్న చిన్న సినిమాల్లోనూ హీరోయిన్గా నటించింది. ఇక గ‌తేడాది సెప్టెంబర్ లో అడ్డాల ఐశ్వర్య మాట్రిమోనీ సంస్థ ద్వారా శ్యామ్ కుమార్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇక కొంతకాలం ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట మధ్య మెల్ల‌గా వివాదాలు చోటు చేసుకున్నాయి. తన భార్య రియల్డర్ కరణం రమేష్ బాబు అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు శ్యామ్ కుమార్ ఆరోపించాడు. ఈ నీచమైన ప‌నులేంట‌ని ప్రశ్నిస్తే తనపై లేనిపోని కేసులు పెడతానంటూ బెదిరించిందని.. శ్యామ్ కుమార్ మీడియాకు వివరించాడు. రమేష్ బాబుతో.. ఐశ్వర్య మాట్లాడిన ఫోన్ కాల్స్ ని కూడా శ్యామ్ కుమార్ మీడియా వేదికగా రివీల్ చేశాడు. ఐశ్వర్య బిహేవియర్ తో తన ఫ్యామిలీ నరకం చూస్తుందని.. ఇప్పటివరకు ఆమె నా దగ్గర 25 లక్షలు కాజేసిందంటూ వాపోయాడు.

గట్టిగా అడిగితే తనకు విడాకులు కావాలని బెదిరిస్తుందని చెప్పుకొచ్చాడు. భార్య వేధింపులు తట్టుకోలేక మీడియా ముందుకు వచ్చి తన గోడు వెళ్ళబుచుకుంటున్నట్లు వివరించాడు. ఆమెపై కేసు పెట్టేందుకు నేను సిద్ధంగా ఉన్నానని.. శ్యామ్ కుమార్ వివరించాడు. ఇక ఈయన ఆరోపణలో వాస్తవం ఎంత ఉందనేది విచారణలో తేలనుంది. అదేవిధంగా భర్త ఆరోపణల పై టాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ప్రస్తుతం ఆమె అమ్మాయిగారు, పలికే బంగారమాయెనా, అలవైకుంఠపురం టీవీ సీరియల్స్ లో హీరోయిన్ గా నటిస్తోంది.