ప్రీమియర్ షో లను క్యాన్సిల్ చేసుకున్న టిల్లు స్క్వేర్.. అసలేం జరుగుతుంది..!

ప్రస్తుత కాలంలో ప్రీమియర్ షోలు అనేవి చాలా వాంటెడ్ అయిపోయాయి. పోస్టర్లు, అప్డేట్లు, ప్రమోషన్స్ తో పాటు మూవీ పై కొంచెం హైప్స్ పెరిగేందుకు ప్రీమియర్ షో లను వేస్తున్నారు. ఇక ప్రీమియర్ షోల బిజినెస్ కూడా భారీగానే పెరిగింది. అదేవిధంగా టిల్లు స్క్వేర్ మూవీ ప్రీమియర్లకు కూడా ముహూర్తం ఖరారు చేశారు. కానీ తాజా సమాచారం మేరకు ఈ ప్రీమియర్ షోలు క్యాన్సిల్ అయినట్లు తెలుస్తుంది.

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్ధూ హీరోగా అనుపమ హీరోయిన్గా నటించిన టిల్లు స్క్వేర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మల్లిక్ రాం దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ ప్రీమియర్లను ఒక్కసారిగా క్యాన్సిల్ చేశారు. టిల్లు స్క్వేర్ సినిమాకు సంబంధించిన వీడియో షోలను ఇప్పటికే క్యాన్సిల్ చేసినట్లు నిర్మాత నాగ వంశీ ప్రకటించాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో షాకింగ్ నిర్ణయం కూడా తీసుకుని ప్రతి ఒక్కరికి షాక్ ఇచ్చారు.

అదేంటంటే.. ముందుగా ఏ ఏరియాల్లోనూ టిల్లు మూవీ ప్రీమియర్ షోలు వేయడం లేదని వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా ప్రీమియర్ షోల కోసం అమ్మిన టిక్కెట్లు సైతం క్యాన్సిల్ చేసినట్టు తెలుస్తుంది. ఆ క్యాన్సిల్ చేసిన టికెట్ల డబ్బులు రిఫండ్ కూడా చేశారట. అయితే.. అమెరికాలో తెలుగు సినిమా హిస్టరీలో ఇంతకుముందు లేని విధంగా ప్రీమియర్ టికెట్లు మూడు వారాల ముందే అమ్మేసి ఇప్పుడు క్యాన్సిల్ చేయడంతో ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు.మరి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.