నేను డ్రగ్స్ కేసులో ఇరుక్కుపోవడానికి కారణం ఇదే… ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన నిహారిక..!

మెగా డాటర్ నిహారిక ఇండస్ట్రీలో మంచి పేరుని సంపాదించుకుంది. ఈమె యాంకర్ గా కూడా చేస్తూ ఉంటుంది. మెగా డాటర్ నిహారిక ఇటీవలే భర్తతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.ఆ తర్వాత నుంచి వెబ్ సిరీస్, సినిమాలు నిర్మిస్తూ..నిర్మాతగా ఫుల్ బిజీ అయిపోయింది. అంతేకాకుండా పలు ఇంటర్వ్యూలో పాల్గొంటూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది.

ఇక ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక… రాడిసన్ బ్లూ పబ్ ఘటన గురించి స్పందించి అసలు విషయాన్ని బయట పెట్టింది. నేను పబ్ కి ఎక్కువ వెళ్ళను. కానీ ఆ రోజున మా స్కూల్ ఫ్రెండ్స్ ను కలవటానికి వెళ్లాను. ఆరు నెలల తర్వాత మేమంతా కలిసాము.కాసేపు అక్కడే ఉండి మాట్లాడుకున్నాము. కానీ అక్కడ సౌండ్స్ వల్ల ఇబ్బంది అనిపించడంతో బిల్లు కట్టి వెంటనే వెళ్లి పోదామని అనుకున్నాము.

బయటకు వెళ్లిన సమయంలోనే పోలీసులు వచ్చారు. దీనితో అందరితోపాటు మమ్మల్ని కూడా స్టేషన్కు తీసుకువెళ్లారు. దీనిపై మీడియా వాళ్లు రచ్చ చేసి రకరకాల వార్తలు రాశారు. అప్పుడు నాకేం అర్థం కాలేదు. నా తప్పు లేని దానికి అలా రాయటం చూసి చాలా బాధ వేసింది. ఆ తర్వాత దాని గురించి తెలిసింది. పబ్ లో కొందరు డ్రగ్స్ తీసుకున్నారని పోలీసులు అందుకే అందర్నీ అరెస్ట్ చేశారని . అప్పుడే తెలుసుకున్నాను నేను తప్పుడు ప్రదేశంలో ఉన్నానని లేటుగా అర్థం చేసుకున్నాను… అంటూ నిహారిక చెప్పుకొచ్చింది.