5వ తరగతిలోనే నాపై రేప్ అటెంప్ట్ జరిగింది.. నాన్న పక్కన పడుకోవాలన్నా భయమేస్తుంది.. టాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్..

నాని హీరోగా, నిత్యమీనన్ హీరోయిన్గా తెరకెక్కిన అలా మొదలైంది.. సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది స్టార్ బ్యూటీ స్నిగ్ధ. నందిని రెడ్డి డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఈ సినిమాలో పింకీ పాత్రలో మగరాయుడు గెటప్ లో కనిపించి మెప్పించింది. నాని, నిత్యామీనన్‌ల‌కు ఫ్రెండ్ గా నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఎప్పుడూ అబ్బాయి గెటప్ లో ఫ్యాంట్, షర్ట్ ధరించి క్రాప్ తో మాత్ర‌మే క‌నిపించే స్నిగ్ధ దాదాపు రియల్ లైఫ్ లో కూడా అదే మగ రాయుడులా ఉండ‌టానికే ఇష్ట‌ప‌డుతుంది.

ఇలా స్నిగ్ధ ఇప్పటివరకు మేం వయసుకు వచ్చాం, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, రొటీన్ లవ్ స్టోరీ, దమ్ము లాంటి ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను సూపర్ గా ఎంటర్టైన్ చేసింది. తాజాగా స్నిగ్ధ‌ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేసింది. ఇందులో భాగంగా తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను షేర్ చేసుకుంది. రీతూ చౌదరి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న దావత్ షో ద్వారా ఇప్పటికే సెలబ్రిటీస్ కు సంబంధించిన ఎన్నో సీక్రెట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక తాజాగా ఈ షోకు స్నిగ్ధ హాజరై సందడి చేసింది. ఇందులో భాగంగా ఆమె జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని వివరించింది. మా అమ్మ చనిపోయినప్పుడు నేను ఆమెను చూడలేకపోయా.

ఆ సిచువేషన్ నన్ను ఎన్నో సంవత్సరాలు బాధ పెట్టిందంటూ వివరించింది. ఇక తను ఐదో తరగతిలో ఉన్నప్పుడు ఇందిరా పార్క్ వెళ్లానని.. అక్కడ ఆడుకుంటున్న టైంలో ఎవడో వచ్చి తనను పొదల చాటుకు తీసుకువెళ్లి లైంగికంగా వేధించాడు అంటూ చెప్పుకొచ్చింది. అది రేప్ అటెంప్ట్ అనే చెప్పాలి.. ఆ ఇన్సిడెంట్ ను నేను ఇప్పటికీ మర్చిపోలేక పోతున్న.. దాని నుంచి నేను బయటపడడానికి దాదాపు పది సంవత్సరాలు పట్టింది అంటూ వివ‌రించింది. నైట్ బెడ్ పై మా నాన్న, మామ పడుకున్న చోట పడుకోవాలన్నా భయమేస్తుంది అంటూ స్నిగ్ధ వివరించింది. ప్రస్తుతం స్నిగ్ధ చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.