‘ SSM29 ‘ మూవీ అనౌన్స్మెంట్ ముహూర్తం ఖరారు చేసిన మేకర్స్.. ఎప్పుడంటే..!

టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారిలో మహేష్ బాబు కూడా ఒకరు. తన తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకున్నాడు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన మహేష్ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకోవడంతో ఈయన ఫ్యాన్స్ చాలా హర్ట్ అయ్యారు. అయినప్పటికీ కృంగిపోకుండా నెక్స్ట్ రాజమౌళి సినిమా ఉంది అనే ధైర్యంతో ముందుకు సాగారు. ఇక తాజాగా మహేష్ మరియు రాజమౌళి సినిమాపై అనేక వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ మరియు రాజమౌళి సినిమా అనౌన్స్మెంట్ డేట్ ఖరారు అయినట్లు తెలుస్తుంది.

ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీ తెలుగువారు ఎంతో ఘనంగా జరుపుకునే ఉగాది పండగ రోజున అనగా ఏప్రిల్ 9వ తేదీన అనౌన్స్ చేస్తున్నట్లు తెలుస్తుంది. సక్సెస్ మీట్ ని భారీగా ఏర్పాటు చేసి ఈ మూవీని అనౌన్స్ చేస్తున్నట్లుగా సమాచారం. ఇక ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారింది.