ఈ ముగ్గురిలో ఉన్న కామన్ క్వాలిటీ అదే .. అందుకే అంత పెద్ద స్టార్ డైరెక్టర్లుగా మారారా..?

ప్రజెంట్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ డైరెక్టర్ ఎవరు ..? అంటే అందరికి ముందు చెప్పే మూడే మూడు పేర్లు రాజమౌళి – సుకుమార్ – ప్రశాంత్ నీల్ .. ఈ ముగ్గురిలో ఏం మ్యాజిక్ ఉందో తెలియదు కానీ ఈ ముగ్గురు తెరకెక్కించిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ సూపర్ డూపర్ హిట్ అవుతూ ఉండడం .. స్టార్ హీరోస్ పాన్ ఇండియా హీరోస్ కూడా వీళ్ళ డైరెక్షన్లో సినిమాలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడం ఆశ్చర్యకరం.

కాగా ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న జక్కన్న ప్రజెంట్ మహేష్ బాబుతో ఓ భారీ అడ్వెంచర్స్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. అలాగే సుకుమార్ పుష్ప2 సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోవడానికి ట్రై చేస్తున్నాడు . ప్రశాంత్ నీల్ సలార్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు . సలార్ 2 తో చరిత్రను తిరగరాయిబోతున్నాడు .

అయితే ఈ ముగ్గురి పేర్లు మాత్రమే ఎందుకు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి .. అంటే మాత్రం వీళ్లకు ఉన్న ఒక క్వాలిటీ గురించి బయటపడింది. బడ్జెట్ విషయంలో ఏ విధంగా ఆలోచించకుండా క్వాలిటీ కంటెంట్ ని క్లియర్గా అభిమానులకి చూపించడమే వీళ్ళ మెయిన్ మోటో అని .. ఆ కారణంగానే వీళ్లు టాప్ డైరెక్టర్లుగా ఇండస్ట్రీలో రాజ్యమేలేస్తున్నారు అని ఫ్యూచర్లో కచ్చితంగా వీళ్ళు సినీ ఇండస్ట్రీకి మరిచిపోలేని రికార్డ్స్ క్రియేట్ చేసి పెడతారు అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు .

ముగ్గురికి ముగ్గురే కంటెంట్ క్వాలిటీ విషయంలో కఠినంగా ఉంటారు. అవతల ఉన్నది ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే ఆ హీరో చేత పదిసార్లు అయినా ఆ సీన్ ని షూట్ చేయిస్తూనే ఉంటారు . అందుకే వీళ్ళు అంత పెద్ద స్టార్స్ గా మారారు అంటున్నారు జనాలు..!!