సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా నివేతా పెతురాజు మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈమె టాలీవుడ్ లో నటించినవి తక్కువ సినిమాలైనా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. ఇటీవల తాజాగా నివేద సంచలన వివాదంలో చిక్కుకుని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఈమెకు రూ.50 కోట్ల విలువైన ఓ విల్లాను తమిళ్ సీఎం కొడుకు ఉదయినేది స్టాలిన్ కొనిచ్చారంటూ సినీ రాజకీయ క్రిటిక్ సువుక్కు శంకర్ వ్యాఖ్యలు చేయడంతో ఈ వార్తలు వైరల్ గా మారాయి. అయితే ఈ వార్తలు మరింత ఎక్కువ కావడంతో తాజాగా ఈ వార్తలపై స్పందించిన నివేత లాంగ్ నోట్ ద్వారా ట్విట్టర్ వేదికగా దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఆమె రాసిన సుదీర్ఘ పోస్టులో ఈ విషయాలను ప్రస్తావించింది.
కొద్ది రోజులుగా నాపై వస్తున్న చెత్త రూమర్లు, రాస్తున్న రాతలు పట్ల చాలా మనస్థాపానికి గురవుతున్నా.. ఓ అమ్మాయి పేరు ఎవరైనా చెత్త రుమర్లు క్రియేట్ చేస్తున్నారంటే వారిది స్వార్థపూరితమైన లక్ష్యంగానే.. వారు టార్గెట్ చేశారని ప్రజలు భావిస్తారు అనుకున్నా. కానీ నన్ను టార్గెట్ చేస్తూ రాస్తున్న ఈ చెత్త రాతలు, దుష్ప్రచారాలు కారణంగా నా కుటుంబం మొత్తం బాధపడుతున్నారు. ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేసే ముందు ఒకసారి అంతా ఆలోచించుకుంటే బాగుంటుందని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అంటూ నివేతా పైత్రాజ్ వివరించింది. నేను ఉన్నతమైన, గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చా.. ఆర్థిక స్వాతంత్రంతో 16వ ఏట నుంచి నేను స్వయంగా సంపాదించుకొని బ్రతకగలుగుతున్న. మా ఫ్యామిలీ దుబాయ్లో జీవిస్తున్నారు. ఇప్పటికీ అక్కడే ఉన్నాం.
గత 20 ఏళ్లుగా మేము అక్కడే ఉంటున్నాం కూడా అంటూ నివేత పేతురాజ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. నేను సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ ఏ నిర్మాతను, డైరెక్టర్ ను, హీరోను అవకాశాలు ఇవ్వమని అడగలేదు. ఇప్పటివరకు 20 సినిమాల్లో నటించా అవి నా టాలెంట్ను గుర్తించి వచ్చిన అవకాశాలే.. అలా వచ్చిన అవకాశాలు ఇష్టపడే నేను సినిమాలు చేశా. ఇండస్ట్రీలో నేను హైయెస్ట్ రెమ్యూనరేషన్ కానీ, డబ్బు పరంగా ఎవరినైనా వేధించడం కానీ చేయలేదు అంటూ వివరించింది. కొంతమంది భావిస్తున్నట్లు నేనేమీ విలాసమంతమైన జీవితాన్ని గడపడం లేదు.
చాలా సింపుల్, ప్రశాంతమైన లైఫ్ను జీవిస్తున్న. సంఘర్షణ, సమస్యలను అధిగమించి మానసిక శాంతితో జీవితాన్ని గడుపుతున్నా. నాకు ఈ శాంతియుతమైన, గౌరవప్రదమైన జీవితమే కావాలి. సమాజంలో ఓ మహిళ కోరుకునే విధంగానే నేను కూడా మంచి కుటుంబం కావాలని కోరుకుంటున్నాను. అయితే కొందరు ప్రచారం చేస్తున్న అసత్యాలు, అవాస్తవాలు, చెత్త రూమర్లను ప్రచురించే ముందు జర్నలిస్టులు సరైన సమాచారం తెలుసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నా.. దానివల్ల నా కుటుంబ గౌరవం ప్రతిష్టకు భంగం కలగదని భావిస్తున్నా. ఇక నాకు సపోర్ట్ నిలిచిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా.. ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది అంటూ నివేద పేతురాజ్ ట్విట్టర్ పోస్ట్ ద్వారా వెల్లడించింది.