ప్రస్తుతం ఫోన్ ట్యాపింగు వ్యవహారం ఇండస్ట్రీలో దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం తో పాటు.. సినీ ఇండస్ట్రీని కూడా ఉలిక్కిపడేలా చేసిన ఈ వివాదంపై నిర్మాత చిట్టిబాబు తాజాగా స్పందించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. చిట్టి బాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్గా మారాయి. ఇది కాంగ్రెస్ చేస్తున్న కుట్రగా ఆయన వివరించాడు. రేవంత్ రెడ్డి సర్కార్ కావాలనే ఈ సినీ పరిశ్రమని టార్గెట్ చేసిందని.. హీరోయిన్లపై పడటం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి అలవాటు అంటూ ఆరోపించాడు. ఒకప్పుడు చెన్నారెడ్డి టైంలో వాణిశ్రీ, జయసుధ లాంటి వారి పైన ఇలాంటి ఇష్యూసే తలెత్తేల చేశారని ఆరోపించాడు.
హీరోయిన్లను ఇలాంటి అశ్లీల విషయాలలో లాగడం నిజంగా దౌర్భాగ్యం అంటూ వివరించాడు. ఫ్యాన్ ట్యాపింగ్ అనేది ప్రతి ప్రభుత్వం చేస్తుంది. కానీ రాష్ట్ర సెక్యూరిటీ బేస్ అయ్యి ఇలాంటివన్నీ జరుగుతాయి. ఏదైనా కుట్ర జరుగుతుందా.. ఏదైనా అల్లర్లు చోటు చేసుకోబోతున్నాయి.. అనే విషయాన్ని ముందుగా తెలుసుకునేందుకు ఫోన్ ట్యాపింగ్ను ఉపయోగిస్తారు. ఫోన్ టాపింగ్ ప్రభుత్వ బాధ్యత అని.. అలాంటి బాధ్యతను దుర్వినియోగం చేసుకోవడం కరెక్ట్ కాదంటూ ఆయన ఆరోపించాడు. ఈ క్రమంలో సమంత, రకుల్ను ప్రస్తావిస్తూ సమంతకి ఏదైనా సమస్య వచ్చి ఉండవచ్చు. ప్రభుత్వమును ఆమె సహాయం అడగడానికి కాల్ చేసి ఉండొచ్చు.
అలాగే అప్పట్లో రకుల్ ప్రీత్ డ్రగ్స్ వివాదంలో చిక్కుకుంది. దాంతో ఆమె ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఉండవచ్చు.. అలా హీరోయిన్లు కాల్ చేసి మాట్లాడితేనే బెడ్ మీద పడుకున్నట్టేనా అంటూ నిర్మాత సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. లైట్ వేసి మరి ఏం జరుగుతుందో వీళ్ళు ఏమైనా చూశారా.. ఫోన్ చేసిన, రూమ్ కి వెళ్లిన ఇక పడుకున్నట్టే లెక్క అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంను ప్రశ్నించాడు. ఇలాంటి చిల్లర ఆరోపణలు, తప్పుడు ప్రచారాలను ఇప్పటికైనా ఆపాలని ఏదైనా తప్పు జరిగితే సాక్షాధారంతో సహా బయట పెట్టాలి.. అంతేకానీ తప్పుడు ప్రచారాలు చేయవద్దు అంటూ హెచ్చరించాడు. ఇక నాగచైతన్య, సమంత విడిపోయినప్పుడు ఇద్దరు స్టేట్మెంట్స్ ఇచ్చారు.
ఎందుకు విడిపోయారో వివరించారు. అంత క్లారిటీగా వాళ్ళు ప్రకటించిన తరువాత.. మధ్యలో మీరు జోక్యం చేసుకోవడం ఏంటి అంటూ ఫైర్ అయ్యాడు. అల్పుడు అధికారంలోకి వస్తే ఇలాంటి దౌర్భాగ్యపు స్థితి వస్తుందని రేవంత్ రెడ్డి నిరూపిస్తున్నారని.. ఫోన్ ట్యాపింగ్ తో ఆ నాయకుడు ఇద్దరు హీరోయిన్లను తన బెడ్ రూమ్ కి పిలుచుకున్నాడు అనుకోండి.. దానికి సంబంధించిన ఆధారాలను బయట పెట్టండి.. అంతేకానీ గాలి వార్తలను, రూమర్స్ స్ప్రెడ్ చేయకండి.. మీ రాజకీయం కోసం నటీనటుల జీవితాలతో ఆడుకోవద్దు అంటూ వివరించాడు. పేరు ఉన్న హీరోయిన్లను లాగితే అది హాట్ టాపిక్ గా మారుతుందని కాంగ్రెస్ పార్టీ కుట్ర అంటూ చిట్టి బాబు ఫైర్ అయ్యాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.