టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాగూర్కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సీతారామం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాలో అచ్చ తెలుగు ఆడపడుచులా తన కట్టుబొట్టుతో కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకున్న ఈమె.. తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటూ సక్సస్ ఫుల్ హీరోయిన్గా రాణిస్తోంది. అయితే కథకు ఇంపార్టెన్స్ ఉంది అనిపిస్తేనే సినిమాను సెలెక్ట్ చేసుకుని నటించే మృణాల్ చివరగా నాని హాయ్ నాన్న సినిమాలో నటించి మరో బ్లాక్ పాస్టర్ తన ఖాతాలో వేసుకుంది.
ఇక ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ జంటగా ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. అలాగే సోషల్ మీడియాలో పోస్ట్ లపై స్పందించింది. హీరోయిన్ల ఫోటోలు, వీడియోలను దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారని.. కామెంట్లు పెడుతున్నారని వెల్లడించింది. కొందరైతే అసలు హీరోయిన్లను వస్తువుల భావిస్తున్నారని చెప్పుకొచ్చింది. అయితే కొంతమంది చేసే చెత్త పనులు చాలా బాధగా అనిపిస్తాయని చెప్పుకొచ్చింది.
హీరోయిన్ల పర్సనల్ పార్ట్స్ పై ఫోకస్ చేసి వాటిని జూమ్ చేసి మరి దారుణంగా కామెంట్లు పెడుతున్నారని.. ఒక ఫోటోను రకరకాలుగా మార్చి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారని.. ఇలాంటివి చూసినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది అంటూ వివరించింది. ఇక ప్రస్తుతం మృణాల్ చేసిన షాకింగ్ కామెంట్స్ నెటింట వైరల్గా మారాయి. దీంతో అలాంటి వారు చేసే చెత్త పనులను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ.. మీ ప్రొఫెషన్ మీరు చాలా అద్భుతంగా రన్ చేస్తున్నారు.. మీ కెరీర్ పై ఫోకస్ పెట్టి మరిన్ని సక్సెస్ లు సాధించాలంటూ అభిమానులు తమ అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు.