నా కోరిక ఇప్ప‌ట్లో తీరేలాలేదు.. రాశీ ఖ‌న్నా షాకింగ్‌ కామెంట్స్.. !!

సౌత్ లో స్టార్ హీరోయిన్గా భారీ పాపులారిటి ద‌క్కించుకుంది రాశి ఖ‌న్నా. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలో నటిస్తూ దూసుకుపోతున్న ఈ అమ్మడు.. తాజాగా యోధ‌ సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించింది. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేసింది. ఆ ఇంటర్వ్యూలో రాశి ఖ‌న్నా మాట్లాడుతూ ఆమెకు ఎన్నో ఏళ్ల నుంచి ఓ డ్రీమ్ ఉందని.. ఆమెకు మాత్రమే కాదు చాలామంది నటీనటులకు ఈ కల ఉంటుందంటూ వివరించింది. ప్రస్తుతం రాశి ఖ‌న్నా చేసిన ఈ కామెంట్స్ నెట్టింట‌ వైరల్‌గా మారాయి.

Back to back shocks for Rashi Khanna

ఇంతకీ ఆమెకు ఉన్న ఆ డ్రీమ్ ఏంటి అనుకుంటున్నారా.. రాశి ఖ‌న్న‌కు ప్రముఖ డైరెక్టర్ సంజయ్ లీలా భ‌న్సాలీతో కలిసి పని చేయాలని ఎన్నో ఏళ్ళుగా ఓ క‌ల ఉంద‌ట‌. అది ఇప్ప‌టివ‌ర‌కు నెర‌వేర‌లేద‌ని ఆమె వివ‌రిస్తూ.. నేను మాత్రమే కాదు ప్రతి యాక్టర్ ఆయనతో సినిమా అయినా చేస్తే బాగుంటుందని కలలు కంటారంటూ చెప్పుకొచ్చింది. ఆయన రూపొందించే సినిమాల్లో స్త్రీలను తనదైన స్టైల్ లో ప్రత్యేకంగా చూపించగల సత్తా ఉన్న దర్శకుడు అని.. ఆయన సినిమాలతో విమర్శకుల్ని కూడా ప్రశంసలు అందించేలా చేస్తాడని.. అందుకే సంజయ్ లీలా భ‌న్సాలితో పనిచేసే రోజు కోసం ఎప్పటినుంచ ఎదురు చూస్తున్నాను అంటూ మనసులోని మాట బయట పెట్టింది.

The Sabarmati Report: Vikrant Massey stars with Raashii Khanna in film  based on 2002 Sabarmati ...

అలాగే కరణ్ జోహార్ తో కూడా ఓ సినిమాలో నటించాలని ఉందంటూ వివరించింది. ఇక త్వరలోనే.. ది సబర్మతి రిపోర్ట్.. సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమవుతుంది రాశి ఖ‌న్న‌. విక్రాంత్ మాసే, రాశి ఈ మూవీలొ జంటగా న‌టించారు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొల్పింది. గోద్ర ట్రైన్ తగలబెట్టడం వెనుక దాగి ఉన్న రహస్యాలను చూపిస్తూ.. నిత్యం ఆసక్తిగా క‌లిగేలా ఈ టీజర్ ను మేక‌ర్స్‌ రూపొదిద్దారు. మే 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.