నా భర్త మిడ్ నైట్ నిద్రలేపి మరీ అలాంటి పని చేశాడు.. స్టార్ నటి షాకింగ్ కామెంట్స్..

యాక్ట్రెస్ మహాలక్ష్మి, నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ జంట గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం. లేదు ప్రేమ, పెళ్లితో ఒకటైన ఈ జంట ఒకప్పుడు నెటింట తెగ వైరల్ అయ్యారు. ఎన్నో ట్రోల్స్, విమర్శలను ఎదుర్కొన్నారు. అయితే ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా వీరు అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటూ తమ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఎప్పటికప్పుడు మహాలక్ష్మి తన భర్తతో కలిసి ఫొటోస్, రీల్స్ చేస్తూ సంతోషంగా లైఫ్ లో ఎంజాయ్ చేస్తుంది. గత ఏడాది రవీందర్ ఓ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.

ఓ వ్యక్తి నుంచి రూ.15 కోట్లు తీసుకుని మోసం చేసిన కేసులో రవీందర్ అరెస్ట్ అయ్యి బెయిల్ పై బయటకు వచ్చారు. ఇక నిన్న మహాలక్ష్మి తన పుట్టినరోజు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా మహాలక్ష్మి.. రవీందర్ గురించి ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ఈరోజు నా పుట్టినరోజు. ఎంతో ఆనందంగా ఉన్నాను. ఈరోజు అంతా ప్రేమ, భావోద్వేగాలతో నిండిపోయింది. నా భర్త నాకు అర్థరాత్రి నిద్ర లేపి రుచికరమైన కేక్ టెస్ట్ చూపించాడు. కేక్ ను చూసి షాక్ అయ్యా.. ఒక్కసారిగా కన్నీళ్లు తిరిగాయి అంటూ వివ‌రించింది.

రవీందర్ హార్ట్ చాలా గొప్పది.. ఆయన నా భర్తగా రావడం నా లక్. నేను ఎప్పటికీ రవీందర్‌ను లవ్ చేస్తూనే ఉంటా అంటూ వివరించింది. అలాగే మహాలక్ష్మి మదర్, బ్రదర్ తనని మానసిక వికలాంగుల ఆశ్రమానికి తీసుకువెళ్లి వారికి ఫుడ్ అందింప చేశారని.. అందుకు వారిద్దరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. ఇక బంగ్లాదేశ్ నుంచి తన ఫాదర్ బర్త్డే విషెస్ తెలియజేసారని.. తన మామయ్య ఫ్రెండ్స్ నుంచి కూడా తనకు బ్లెస్సింగ్స్ వచ్చాయంటూ వివరించింది. మీరంతా నాపై చూపిస్తున్న ప్రేమకు చాలా ధన్యవాదాలు అంటూ మహాలక్ష్మి పోస్ట్ లో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మహాలక్ష్మి చేసిన ఈ పోస్ట్ నెటింట‌ వైరల్ గా మారింది.