కవల పిల్లలకు జన్మనిచ్చిన మంచు మనోజ్.. క్లారిటీ ఇదే..

టాలీవుడ్ కలెక్షన్ కింగ్‌ మంచు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ – భూమా మౌనిక రెడ్డి గతేడాది గ్రాండ్ లెవెల్‌లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ జంట గుడ్ న్యూస్ కూడా వినిపించారు. చివరిసారిగా తమకు తంవ‌ర‌లోనే బిడ్డ పుట్టబోతుందని మౌనిక రెడ్డి ప్రెగ్నెన్సీ పై అధికారికంగా అనౌన్స్ చేశారు. అప్పుడు తనకు రెండో నెల నడుస్తోందని.. ఈ దంపతులు త‌మ ఆనందాని సోష‌ల్ మీడియా వేదిక‌గి అభిమానుల‌తో షేర్ చేసుకున్నారు. అయితే ప్రస్తుతం మళ్ళీ వారికి పుట్టబోయే బిడ్డపై వార్తలు నెటింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఇటీవ‌ల యంగ్ హీరో శ‌ర్వానంద్‌కు కూతురు పుట్టిన సంగతి తెలిసిందే.

Manchu Manoj and wife Bhuma Mounika Reddy are expecting their first child;  announce pregnancy | PINKVILLA

ఈ నేపథ్యంలో మనోజ్ – మౌనిక రెడ్డిలు కూడా తల్లిదండ్రులయ్యారని. ఈ జంట పండంటి కవలలకు జన్మనిచ్చారంటూ తప్పుడు వార్తలను వైరల్ చేశారు. ఈ వార్తలు బయటకు వచ్చిన కొద్దిసేపటికి నెటింట‌ తెగ చెక్కర్లు కొట్టాయి. ఇక తాజాగా దీనిపై మంచు మనోజ్ స్పందించాడు. అసలు విషయాన్ని బయట పెట్టాడు. మా అభిమాన కుటుంబానికి శుభవార్త.. నా సతీమణికి ప్రస్తుతం ఏడవ నెల జరుగుతుంది. ఆమె చాలా ఆరోగ్యంగా ఉంది. ఇంక కొన్ని రోజుల్లో మా జీవితంలోకి రాబోతున్న బిడ్డ పట్ల ఎంతో ఆనందంగా ఎదురు చూస్తున్నాం.

Manchu Manoj | బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసిన భూమా మౌనిక-Namasthe Telangana

కానీ ఒక విషయాన్ని స్పష్టం చేయాలనుకున్నా.. మాకు కవలలు పుట్టారంటూ బయట వస్తున్న వార్తల్లో అసలు నిజం లేదు. అవన్నీ కేవలం పుకార్లే. ఆ సందర్భం నిజంగా వచ్చినప్పుడు.. మేమే అధికారికంగా తెలియజేస్తాం. దయచేసి ఇలాంటి వార్తలు ఎన్ని బయటకు వచ్చినా అసలు పట్టించుకోవద్దు అంటూ మంచు మనోజ్ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం మంచు మనోజ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవడంతో.. నిజంగానే కవలలు పుట్టారని ఆనందించిన అభిమానులు కాస్త నిరాశ వ్య‌క్తం చేస్తున్నారు.