మొన్న ఎన్టీఆర్ ఇప్పుడు మరో పాన్ ఇండియా స్టార్.. జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన మమిత బైజు..!

మమిత బైజు.. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఈ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనం చూస్తూనే ఉన్నాము. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు మమిత బైజు ఫోటోలు ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి . ఏ సినిమాలో అయినా సరే ఇప్పుడు హీరోయిన్ గా మమిత బైజునే కనిపిస్తుంది . ప్రేమలు అనే సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది ఈ అందాల ముద్దుగుమ్మ .

కాగా తెలుగు ఇండస్ట్రీలో బడా బడా ఆఫర్స్ పట్టేస్తుంది మమితా బైజు. మొన్నటికి మొన్న ఎన్టీఆర్ సినిమాలో నటించే ఛాన్స్ అందుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు ఏకంగా రామ్ చరణ్ నటించబోయే సినిమాలో అవకాశం అందుకున్నట్లు తెలుస్తుంది . బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు రీసెంట్ గానే జరిగాయి .

ఈ సినిమాలో మొదటి హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుంది. అయితే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్ర కూడా కీలకంగా ఉండబోతుందట . అంతేకాదు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. ఈ సినిమాలో హీరోయిన్గా మమిత బైజును సెలెక్ట్ చేసుకున్నారట మేకర్స్. లేటెస్ట్ ట్రెండ్ కి తగ్గట్టు ఆమె పేరుని చూస్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు పాన్ ఇండియా స్టార్ సినిమాలలో అవకాశం అందుకుంది మమిత బైజు అంటూ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది..!!