కొంప ముంచేసిన లావణ్య త్రిపాఠి… మెగా అభిమానులకి ఊహించని షాక్..!

ఈ మధ్యకాలంలో మెగా కోడలు లావణ్య త్రిపాఠి పేరు ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో కూసింత ఎక్కువ రేంజ్ లోనే ట్రోలింగ్కి గురవుతుంది. రీజన్ ఏంటో తెలియదు కానీ అంతకుముందు లావణ్య త్రిపాఠి పేరు చెప్తే సింపుల్గా నవ్వి ఊరుకునేవారు జనాలు . కానీ ఇప్పుడు రూట్ మారిపోయింది. లావణ్య త్రిపాఠి అంటే మెగా కోడలు అని మెగా కోడల్ని బాగా టార్గెట్ చేసే ట్రోల్ చేసేది అలవాటుగా మార్చేసుకున్నారు. లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత నటించిన ఫస్ట్ వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్ .

ఈ సిరీస్లో చాలా చాలా సైలెంట్గా కూల్ పాత్రలో కనిపించింది . కానీ కొందరు వ్యంగ్యంగా వెటకారంగా ట్రోల్ చేశారు. పెళ్లి తర్వాత నీకు ఇలాంటివి అవసరమా..? అంటూ కొందరు మండిపడ్డారు . అలాంటివి పెద్దగా పట్టించుకోని లావణ్య త్రిపాఠి సినిమాల పరంగా ముందుకు వెళ్లడానికి డిసైడ్ అయింది . అయితే లావణ్య త్రిపాఠి ని పెళ్లి చేసుకున్న తర్వాత వరుణ్ తేజ్ నటించిన ఫస్ట్ సినిమా “ఆపరేషన్ వాలెంటైన్”.. ఈ సినిమా డిజాస్టర్ టాక్ అందుకుంది .

దీనితో లావణ్య త్రిపాఠిని ఐరన్ లెగ్ అంటూ కొందరు ట్రోల్ చేశారు. అంతేకాదు లావణ్య త్రిపాఠి వరుణ్ కి సూట్ అవ్వదు అంటూ కావాలనే కొందరు టార్గెట్ చేసి ఆమెను ఇబ్బందికర సిచువేషన్ లోకి నెట్టేశారు . అయితే రీసెంట్ గా లావణ్య త్రిపాఠి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాకి దూరం కాబోతుందట . సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటేనే ఈ తల తిక్క ట్రోల్స్ మీమ్‌స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అని.. అసలు సోషల్ మీడియాని పట్టించుకోకపోతే ప్రాబ్లం ఉండదు అని సోషల్ మీడియాకి దూరం కావడానికి నిర్ణయం తీసుకుందట. ఇది నిజంగా మెగా అభిమానులకు ఊహించని షాక్ అంటున్నారు జనాలు..!!